Begin typing your search above and press return to search.

'ఉస్తాద్' మంచు మనోజ్.. సర్ ప్రైజ్ వచ్చేసింది

కెరియర్ పరంగా లాంగ్ గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   29 Nov 2023 2:46 PM GMT
ఉస్తాద్ మంచు మనోజ్.. సర్ ప్రైజ్ వచ్చేసింది
X

కెరియర్ పరంగా లాంగ్ గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలతో పాటు ఓటీటీ కోసం హోస్ట్ అవతారం ఎత్తాడు మంచు వారబ్బాయి. ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారం కాబోయే ఓ షో కోసం మనోజ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు ఆ మధ్య ఓ ప్రోమో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ టాక్ షోని నిర్మించనున్నారు.


దీనికి 'ర్యాంప్ ఆడిద్దాం' అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు ఇటీవలే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఈ షో కి సంబంధించి టైటిల్ రివీల్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 'ర్యాంప్ ఆడించడానికి అదిరిపోయే సెలబ్రిటీ గేమ్ షో తో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సరికొత్తగా వస్తున్నాడు' అంటూ ఈ పోస్టర్ ని రివీల్ చేశారు. ఇక ఈ టాక్ షోకి 'ఉస్తాద్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ లో మంచు మనోజ్ ఓ డిఫరెంట్ మాస్క్ వెనక ఇంటెన్స్ లుక్ తో కనిపించాడు.

ఈ పోస్టర్ తో మనోజ్ హోస్ట్ చేయబోయే ఈ టాక్ షోపై మరింత ఆసక్తి పెరిగింది. త్వరలోనే ఈ షోని ఈటీవీ విన్ లో ప్రసారం చేయబోతున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. మంచు మనోజ్ ఈ షో కి సంబంధించిన టైటిల్ ని రివీల్ చేస్తూ ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర ట్వీట్స్ చేశారు." నా తొలి గేమ్ షో USTAAD ర్యాంప్-ఆడిద్దాం టైటిల్‌ను వెల్లడించడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఫన్, ఎంటర్ టైన్మెంట్ తో స్మాల్ స్క్రీన్ వైల్డ్‌గా మారబోతోంది.

సంవత్సరాలుగా మీ ప్రేమకు నేను కృతజ్ఞుడను. మంచి వైబ్‌లు వస్తున్నాయి, ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన రైడ్ కోసం సిద్ధంగా ఉండండి" అంటూ మనోజ్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా ఈ సెలబ్రిటీ టాక్ షోలో మొదటి గెస్టులుగా హనుమాన్ మూవీ టీం పాల్గొన్నట్లు తెలుస్తోంది. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటించిన హనుమాన్ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే మంచు మనోజ్ షోకి తేజ ప్రశాంత్ వర్మ హాజరైనట్లు సమాచారం. త్వరలోనే ఈ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో కూడా విడుదల చేనున్నారు. ఇక 'ఆహా' తర్వాత తెలుగు ఓటీటీ గా పేరొందిన ఈటీవీ విన్ ఈ ఏడాది మార్చ్ లో ప్రారంభం కాగా ఇప్పటికే ఈ ఓటీటీ ద్వారా పలు విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. కంటెంట్ ఉన్న సినిమాలతో పాటు సరికొత్త గేమ్ షోస్ ని కూడా ప్లాన్ చేయడం విశేషం.