Begin typing your search above and press return to search.

ఊర్వ‌శిని ఆటాడుకుంటున్నారు

బాలీవుడ్ గ్లామ‌ర‌స్ డాళ్ తెలుగు యువ‌త హృద‌యాల‌ను గెలుచుకుంది.

By:  Tupaki Desk   |   1 April 2024 8:17 AM GMT
ఊర్వ‌శిని ఆటాడుకుంటున్నారు
X

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా టాలీవుడ్ కి సుప‌రిచితం. మెగాస్టార్ చిరంజీవి, గోపిచంద్, మంచు విష్ణు, అఖిల్ వంటి స్టార్ల సినిమాల్లో స్పెష‌ల్ నంబ‌ర్ల‌లో న‌ర్తించింది ఈ బ్యూటీ. బాలీవుడ్ గ్లామ‌ర‌స్ డాళ్ తెలుగు యువ‌త హృద‌యాల‌ను గెలుచుకుంది. రెండుసార్లు అందాల పోటీల‌ టైటిల్స్‌లో భాగమైంది. ఒక‌సారి టైటిల్ విజేత‌గా నిలిచింది. ఫ్యాషన్ పరిశ్రమలో ఊర్వ‌శి ప్రయాణం 15 సంవత్సరాల వయస్సులో ప్రారంభమైంది. మిస్ టీన్ ఇండియా 2009 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. యుక్తవయసులో మోడల్‌గా, లాక్మే ఫ్యాషన్ వీక్, అమెజాన్ ఫ్యాషన్ వీక్, బాంబే ఫ్యాషన్ వీక్, షోస్టాపర్‌గా ర్యాంప్‌పై నడిచింది. దుబాయ్ ఫ్యాషన్ వీక్ లోను మెరుపులు మెరిపించింది.

ఊర్వశి రౌతేలా ఫ్యాష‌న్ ఎంపికలు ప్ర‌తిసారీ చ‌ర్చ‌నీయాంశ‌మే. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తనను తాను చిత్రీకరించుకున్న విధానం ట్రోల్‌లకు గురి అవుతోంది. గతేడాది టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ రిషబ్ పంథ్ ను వేధించినందుకు ఊర్వశి వార్తల్లో నిలిచింది.

ఇటీవల ఊర్వశి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో మ్యాట్రిమోనీ యాప్ ప్ర‌చారంలో భాగంగా ఒక వీడియోను షేర్ చేసింది. అందులో తన భాగస్వామిలో తాను వెతుకుతున్న లక్షణాల గురించి మాట్లాడింది. అంతేకాదు.. మ్యాట్రిమోనీ యాడ్‌లో రిషబ్ పంత్ పేరును ఎగతాళి చేయ‌డ‌మే గాక అత‌డిని ముగ్గులోకి లాగింది. ఆ వీడియోలో ఊర్వశి రిషబ్‌పై విరుచుకుపడుతూ కనిపించింది. తాను నటులు, వ్యాపారవేత్తలు, గాయకులు, బ్యాట్స్‌మెన్‌లను (రిషబ్‌ను వెక్కిరిస్తూ) చూసి ``కుచ్ లోగ్ తో మేరీ హైట్ కే భీ నహీ హై..`` (వాళ్ళలో కొందరు నా ఎత్తుకు కూడా సరిపోలేదు) అని ఊర్వశి కామెంట్ చేసింది. ఈ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించడ‌మే గాక యూట్యూబ్ లో వైర‌ల్ గా దూసుకుపోతోంది.

అయితే నేరుగా రిష‌బ్ పేరును సూచించ‌కుండా అత‌డి ఎత్తును ఎగ‌తాళి చేయ‌డంతో నెటిజ‌నులు తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు. మరోసారి రిషబ్ పేరును ఊర్వశి గొడ‌వ‌లోకి లాగడంతో నెటిజన్లకు అది పెద్దగా మింగుడు పడలేదు. దీంతో సోష‌ల్ మీడియాల్లో ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆమె రిషబ్ పంత్‌ను ఎందుకు షూట్ చేస్తోంది? అంటూ ఒక‌రు ప్ర‌శ్నించ‌గా, మరొక నెటిజ‌న్ ``ఆమెకు ఎత్తు కావాలా లేదా బాగా చదువుకున్న భాగస్వామి కావాలా? నిర్ణయించుకోవాలి`` అని రాశారు.

ఊర్వశి- రిషబ్‌ల వైరం గురించి నెటిజ‌నుల‌కు తెలుసు. ఒక కార్యక్రమంలో ఊర్వశి రిషబ్ పంత్ తనపై ప్రేమ‌- ఆస‌క్తిని క‌లిగి ఉన్నాడ‌ని చెప్పడంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌ ప్రారంభమైంది. దీనికి రిషబ్ సోషల్ మీడియాలో ఒక రహస్య పోస్ట్‌తో ప్రతిస్పందించాడు. హెడ్‌లైన్స్ కోసం కొంద‌రు ఇంటర్వ్యూలలో అబద్ధాలు చెబుతున్నారు.. అని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి పంత్ మౌనం పాటించాడు. ఇంత‌కుముందు కూడా ఊర్వశి రిషబ్‌ని టార్గెట్ చేయడంతో నెటిజనుల‌కు చిర్రెత్తుకొచ్చింది.

మరోవైపు రిష‌బ్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉన్నాడు. IPL 2024 మొదటి రెండు మ్యాచ్‌లలో DC ఓడిపోయింది. ఏప్రిల్ 4న మ‌రో మ్యాచ్ లో కేకేఆర్ తో త‌ల‌ప‌డ‌నుంది.