Begin typing your search above and press return to search.

బాలయ్య కోసం ఇద్దరు నిర్మాతలా?

గతంలో ఒక సినిమా హిట్ అయితే వరుసగా రెండు, మూడు సినిమాలు డిజాస్టర్ అవుతూ ఉండేవి.

By:  Tupaki Desk   |   11 Nov 2023 9:27 AM GMT
బాలయ్య కోసం ఇద్దరు నిర్మాతలా?
X

నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ ని అందుకున్నాడు. చాలా ఏళ్ళ తర్వాత బాలయ్య ఖాతాలో వరుసగా మూడు హిట్స్ చేరాయి. గతంలో ఒక సినిమా హిట్ అయితే వరుసగా రెండు, మూడు సినిమాలు డిజాస్టర్ అవుతూ ఉండేవి.

అయితే ఇప్పుడు కథల ఎంపికలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ బాలయ్య జర్నీ చేస్తున్నారు. భగవంత్ కేసరి సక్సెస్ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా బాబీ దర్శకత్వంలో సినిమాని ప్రారంభించేశాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి జరగనుంది. తాజాగా మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక బాబీ మూవీ కంప్లీట్ అయిన తర్వాత బాలయ్య మూవీ ఎవరితో ఉండే అవకాశాలు ఉన్నాయనే దానిపై ఇంటరస్టింగ్ చర్చ నడుస్తోంది.

బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్యతో సినిమాని తానే చేయాల్సి ఉంది. అయితే ఫైనల్ గా అది వేరొకరి చేతికి వెళ్ళింది. అయితే ఇప్పుడు బాలయ్య డేట్స్ కోసం దిల్ రాజు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. బాలకృష్ణ కోసం వంశీ పైడిపల్లితో అదిరిపోయే యాక్షన్ బేస్డ్ స్టొరీ కూడా రాయిస్తున్నారు.

మరో వైపు అల్లు అరవింద్ ఇప్పటికే గీతా ఆర్ట్స్ లో బాలయ్యతో మూవీ చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. గతంలో ఓ సందర్భంలో ఎనౌన్స్ కూడా చేశారు. బోయపాటి డేట్స్ కూడా గీతా ఆర్ట్స్ దగ్గర ఉండటంతో వీరిద్దరి కాంబోలో అఖండ సీక్వెల్ ని చేయడానికి ప్లాన్ జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ అఖండ సీక్వెల్ కూడా మిర్యాల రవీంద్రరెడ్డి కూడా వెయిట్ చేస్తున్నారు.

మరో వైపు బోయపాటి ముందుగా సూర్య హీరోగా ఒక పాన్ ఇండియా సినిమా చేసి తరువాత బాలయ్యతో అఖండ సీక్వెల్ ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఈ లోపు దిల్ రాజు, వంశీ పైడిపల్లికి కథ చెప్పి ఒకే చేయించుకుంటే ముందుగా అదే పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంటుంది. మరి ఇద్దరు బడా నిర్మాతల మధ్యలో బాలయ్య సినిమా ఎవరికి ముందు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.