Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్, తారక్.. చాలా ఏళ్లకు మళ్లీ ఇలా..

ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై సినీ ప్రియులతో పాటు ఫ్యాన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   8 April 2024 12:30 AM GMT
త్రివిక్రమ్, తారక్.. చాలా ఏళ్లకు మళ్లీ ఇలా..
X

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవల గోవాలో ఓ సాంగ్ షూట్ చేసినట్లు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై సినీ ప్రియులతో పాటు ఫ్యాన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా రిలీజ్ కానుంది ఈ చిత్రం.

అయితే ఇటీవల స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ కు తారక్ స్పెషల్ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ మంచి లాభాలు అందిస్తోంది. దీంతో చిత్ర యూనిట్ రేపు ప్లాన్ చేసిన సక్సెస్ ఈవెంట్ కు తారక్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దేవర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నా.. తారక్ మాత్రం కచ్చితంగా టిల్లు స్క్వేర్ ఈవెంట్ కు హాజరవనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ మూవీని నిర్మాత నాగవంశీ తో పాటు త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. దీంతో త్రివిక్రమ్ కూడా ఈ వేడుకకు రానున్నట్లు సమాచారం. అంటే చాలా కాలం తర్వాత త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికను పంచుకోనున్నారన్నమాట.

ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ మారింది. త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ వేదిక పంచుకుని చాలా కాలం అయింది. అరవింద సమేత వీర రాఘవ మూవీ టైమ్ లో ఒకే స్టేజి పై వీరిద్దరూ కనిపించగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ జరగలేదు. అయితే అల్లు అర్జున్ అల వైకుంఠపురం తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చినా.. ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు.

ఇటీవల త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీ తీయగా మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఇంకా కొత్త మూవీ ప్రకటించలేదు. ఇక తారక్ దేవర తర్వాత వార్-2, ఎన్టీఆర్ 31 చేయనున్నారు. అయితే ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ పాన్ ఇండియా స్టోరీ రెడీ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి మళ్లీ త్రివిక్రమ్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా ఉంటుందో లేదో చూడాలి.