Begin typing your search above and press return to search.

త్రివిక్ర‌మ్ పాన్ ఇండియా మ‌ల్టీస్టార‌ర్!

మ‌రి త్రివిక్ర‌మ్ హీరోలు ఎవ‌రు? అంటే మెగాస్టార్ చిరంజీవి-కింగ్ నాగార్జుల‌ను ఒకే ప్రేమ్ లో చూపించాల‌ని గురూజీ భావిస్తున్న‌ట్లు తాజాగా లీకులందుతున్నాయి.

By:  Tupaki Desk   |   10 April 2024 1:30 PM GMT
త్రివిక్ర‌మ్ పాన్ ఇండియా మ‌ల్టీస్టార‌ర్!
X

స్టార్ డైరెక్ట‌ర్లంతా పాన్ ఇండియాలో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి..సుకుమార్..ప్ర‌శాంత్ నీల్...సందీప్ రెడ్డి వంగా..చందు మొండేటి లాంటి వారు ఇప్ప‌టికే ప్రూవ్ చేసుకున్నారు. కొర‌టాల శివ దేవ‌ర‌తో ఎంట్రీ ఇస్తున్నారు. మ‌రి గురూజీ త్రివిక్ర‌మ్ ఎంట్రీ ఇప్పుడు ఉంటుంద‌ని చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. కానీ అది కార్య‌రూపం దాల్చ‌లేదు. పాన్ ఇండియాలో సినిమాలు చేసే స‌త్తా ఉన్నా? ఆయ‌న అటెందుకు చూడ‌టం లేద‌ని అభిమానులంతా నిరుత్సాహ ప‌డుతోన్న వేళ‌..గురూజీ ఏకంగా భారీ పాన్ ఇండియా మల్టీస్టార‌ర్ కే స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు వెలుగులోకి వ‌స్తోంది.


మ‌రి త్రివిక్ర‌మ్ హీరోలు ఎవ‌రు? అంటే మెగాస్టార్ చిరంజీవి-కింగ్ నాగార్జుల‌ను ఒకే ప్రేమ్ లో చూపించాల‌ని గురూజీ భావిస్తున్న‌ట్లు తాజాగా లీకులందుతున్నాయి. ఇద్ద‌ర్నీ ప్ర‌ధాన పాత్ర ధారులుగా చేస్తూ ఓ పాన్ ఇండియా సినిమా చేయాల‌ని సంక‌ల్పించారుట‌. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీకాంబినేష‌న్ సెట్ అయిన నేప‌థ్యంలో త్రివిక్ర‌మ్ స‌మీక‌ర‌ణాలు మారుస్తున్న‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి బ‌న్నీ ` పుష్ప‌-2` త‌ర్వాత గురూజీ తో సినిమా చేయాలి. కానీ అట్లీ తెర‌పైకి రావ‌డంతో ముందుగా అట్లీ వైపు ఐకాన్ స్టార్ మొగ్గు చూపుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆ సినిమాకి ధీటుగా చిరు-నాగ్ ల‌ను గురూజీ తెర‌పైకి తెస్తున్న‌ట్లు తెలుస్తోంది. చిరంజీవితో సినిమా చేస్తాన‌ని త్రివిక్ర‌మ్ చాలా కాలం క్రిత‌మే ప్ర‌క‌టించారు. కానీ అది ఇంత‌వ‌ర‌కూ సాధ్య‌ప‌డ‌లేదు. ఈ నేప‌థ్యంలోనే అన్న‌య్య‌ని ఏకంగా పాన్ ఇండియాలోనే హైలైట్ చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున‌తో త్రివిక్రమ్ ప్రెండ్ షిప్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు కాక‌ముందు నాగ్ సినిమాల‌కు రైట‌ర్ గా ప‌నిచేసారు. అప్ప‌టి నుంచి ప‌రిచ‌యం ఉంది. కానీ సినిమా కాంబినేష‌న్ మాత్రం కుద‌ర్లేదు.

ఇంత‌కాలానికి ఆ క‌ల‌యిక సాద్య‌మ‌వుతుంది. ఇక చిరు-నాగ్ బాండింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రి మ‌ధ్య చాలా కాలంగా మంచి స్నేహం కొన‌సాగుతంది. కానీ క‌లిసి మాత్రం సినిమాలు చేయ‌లేక‌పోయారు. ఇప్పుడు త్రివిక్ర‌మ్ కార‌ణంగా అది సాధ్య‌మ‌వ్వ‌డంతో వాళ్లు సంతోషంగానే ఉన్న‌ట్లు స‌మాచారం. ఇది ప‌క్కా త్రివిక్ర‌మ్ మార్క్ ఎమోష‌న‌ల్ అంశాల్ని ట‌చ్ చేస్తూనే భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రంగా మ‌ల‌చ‌బోతున్నారుట‌. ప్ర‌స్తుతానికి స్టోరీ లైన్ పై గురూజీ ప‌నిచేస్తున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. ఈ చిత్రాన్ని నిర్మించేది కూడా కొణిదెల‌-అన్నపూర్ణ‌ నిర్మాణ సంస్థ‌లేన‌ని స‌మాచారం. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.