Begin typing your search above and press return to search.

యానిమ‌ల్ బ్యూటీ ట్రిప్తీ దిమ్రీ ఎఫైర్ క‌హానీ

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన `యానిమల్` చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 Dec 2023 3:39 AM GMT
యానిమ‌ల్ బ్యూటీ ట్రిప్తీ దిమ్రీ ఎఫైర్ క‌హానీ
X

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన `యానిమల్` చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ విజ‌యాన్ని మించి ఇందులో న‌టించిన తార‌ల‌కు గొప్ప పేరొచ్చింది. ఇందులో అతిథి పాత్ర‌లో న‌టించి త్రిప్తి డిమ్రీ అంద‌చందాలు, ప్ర‌తిభ‌ అంద‌రి దృష్టిని ఆకర్షించాయి. రణబీర్ కపూర్ సరసన ఈ చిత్రంలో సహాయక పాత్రను పోషించింది. అయితే ఈ పాత్ర దేశవ్యాప్తంగా కీర్తిని సంపాదించడంలో సహాయపడింది.

యానిమ‌ల్ బ్యూటీని `నేష‌న‌ల్ క్రష్` అని పిల‌వ‌డం ట్రెండ్ గా మారింది. అదే స‌మ‌యంలో ట్రిప్తి పాత ఎఫైర్ల గురించి ఇప్పుడు మీడియాలో ఫుంఖానుపుంఖాలుగా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. అనుష్క శ‌ర్మ సోద‌రుడు క‌ర్ణేష్ తో ప్రేమాయ‌ణం సాగించి బ్రేక‌ప్ అయిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత‌ సామ్ మర్చంట్ అనే వ్యాపారవేత్త కం మోడ‌ల్ తో డేటింగ్ చేస్తున్నట్లు పుకారు వచ్చింది. ఓ వివాహ వేడుకలో అత‌డితో క‌లిసి ఉన్న‌ కొన్ని ఫోటోలను పోస్ట్ చేసిన తర్వాత పుకార్లు మొద‌ల‌య్యాయి. అయితే ఇవి అవాస్తవమని తెలుస్తోంది. ఇటీవలి ప్రముఖ న్యూస్ పోర్టల్ వెలువ‌రించిన క‌థ‌నం ప్ర‌కారం.. ఈ డేటింగ్ నిజం కాద‌ని వెల్ల‌డైంది.

ట్రిప్తి డిమ్రీ ఒకప్పుడు నటి అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మతో డేటింగ్ చేసింది. ఈ జంట తమ సంబంధాన్ని అధికారికంగా ఎప్పుడూ అంగీకరించలేదు. వీరిద్దరూ ఇక కలిసి లేరని తాజాగా తేలింది. తాజా వార్తా క‌థ‌నంలో ఇలా రాసారు. ట్రిప్తీ-సామ్ ప్రేమాయ‌ణం కేవ‌లం పుకారు మాత్ర‌మే. ట్రిప్తీ ఒంటరిగా ఉంటోంది. కొందరి మ‌న‌సులు ఊహాశక్తిని కలిగి ఉంటాయి. ట్రిప్తి సామ్‌తో ప్రేమ‌లో ఉంద‌ని ప్ర‌చారం చేసేవారిని నిందించలేం. ఇలాంటివి సాధారణం.. బాలీవుడ్‌లోనే కాదు.. ఈ రోజుల్లో అన్ని రంగాల్లోనూ ఇలాంటివి వింటున్నాం`` అని సోర్స్ పేర్కొంది.

ట్రిప్తి కూడా ఈ మధ్య తాను ఒంటరిగా ఉన్నానని స‌ద‌రు పోర్ట‌ల్ ఇంట‌ర్వ్యూలో అంగీకరించింది. సామ్ మర్చంట్ గోవాలో వాటర్స్ బీచ్ లాంజ్ & గ్రిల్‌ను స్థాపించిన హోటల్ వ్యాపారి. అత‌డు ఉత్సాహభరితమైన ప్రయాణీకుడిగా తన ప్రయాణాల గురించి బ్లాగ్ లో రాస్తాడు. దాదాపు 249k అనుచరులను క‌లిగి ఉన్నాడు. సామ్‌ను ట్రిప్తీతో పాటు సెలబ్రిటీలు టైగర్ ష్రాఫ్, దిశా పటానీ అనుసరిస్తున్నారు.

యానిమల్‌లో జోయాగా నటించిన ట్రిప్తీకి సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ 4 మిలియన్లకు చేరుకుంది. 40ల‌క్ష‌ల మంది అనుచ‌రులు ఉన్నారు ఇప్పుడు. యానిమ‌ల్ లో ర‌ణ‌బీర్‌తో సన్నిహిత సన్నివేశాలు విమర్శలకు దారితీసినప్పటికీ ట్రిప్తీ స్పందిస్తూ -``ఆ స‌న్నివేశాలు అసభ్యంగా ఉండవ‌ని సందీప్ స‌ర్ హామీ ఇచ్చాకే న‌టించాన‌ని తెలిపింది. అవి ర‌స‌వ‌త్త‌రంగా అందాన్ని ఎలివేట్ చేస్తూ చిత్రీకరించిన‌వి. ఒక‌వేళ నేను సౌక‌ర్యంగా లేకుంటే ఆ సీన్లు చేయడానికి వేరే మార్గం గురించి ఆలోచిస్తాము అని సందీప్ అన్నారు`` అని తెలిపింది.