Begin typing your search above and press return to search.

గుంటూరు కారంతో సూపర్‌ స్టార్‌ కి నివాళి..!

ఒక సన్నివేశంలో భాగంగా ఒక్కడు సినిమాలోని చెప్పవే చిరుగాలి పాటను పెట్టినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   2 Jan 2024 9:40 AM GMT
గుంటూరు కారంతో సూపర్‌ స్టార్‌ కి నివాళి..!
X

సూపర్ స్టార్‌ మహేష్ బాబు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సూపర్‌ స్టార్‌ కృష్ణ చనిపోయిన తర్వాత మహేష్ బాబు నుంచి వచ్చే మొదటి సినిమా అవ్వడం వల్ల ఫ్యాన్స్ కి ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌ లను దర్శకుడు త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేశాడు అనే సమాచారం అందుతోంది.

గుంటూరు కారం సినిమా చూసే ప్రేక్షకులకు మరియు ఫ్యాన్స్ కు కృష్ణ ను గుర్తు చేసే విధంగా రెండు సన్నివేశాల్లో ఆయన సినిమాలకు సంబంధించిన రిఫరెన్స్‌ లను తీసుకున్నారని తెలుస్తోంది. కృష్ణ కు సంబంధించిన ఒక పాపులర్ డైలాగ్‌ ను మహేష్ బాబు చేత ఫైటింగ్‌ సన్నివేశం సందర్భంగా చెప్పించాడని సమాచారం అందుతోంది.

ఒక సన్నివేశంలో భాగంగా ఒక్కడు సినిమాలోని చెప్పవే చిరుగాలి పాటను పెట్టినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. అదే సన్నివేశంలో కృష్ణ సూపర్‌ హిట్‌ సాంగ్‌ బిట్‌ ను కూడా మహేష్ బాబుతో త్రివిక్రమ్‌ పాడించాడని సమాచారం అందుతోంది. మొత్తానికి గుంటూరు కారంతో సూపర్‌ స్టార్‌ కృష్ణ కి నివాళి అర్పించబోతున్నారు.

మహేష్ బాబు కు జోడీగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా కీలక పాత్రలో ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి నటించింది. తాజాగా విడుదల అయిన కుర్చి మడత పెట్టి సాంగ్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూనే మంచి మార్కులు దక్కించుకుంది. కనుక గుంటూరు కారం ఈ సంక్రాంతికి మాస్‌ ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వడం ఖాయం.