Begin typing your search above and press return to search.

రైలు ప్రమాదంలో నిర్మాత మరణం!

టీవీ సీరియ‌ళ్ల‌తో పాపుల‌రైన ప్ర‌ముఖ నిర్మాత ఎస్.వి.ఎస్.వేణుగోపాల్ (60) బుధవారం రాత్రి మృతిచెందారు. అయితే ఆయన ఆత్మ‌హ‌త్య చేసుకుని మ‌ర‌ణించార‌ని ప్ర‌చారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   10 Nov 2023 4:25 AM GMT
రైలు ప్రమాదంలో నిర్మాత మరణం!
X

టీవీ సీరియ‌ళ్ల‌తో పాపుల‌రైన ప్ర‌ముఖ నిర్మాత ఎస్.వి.ఎస్.వేణుగోపాల్ (60) బుధవారం రాత్రి మృతిచెందారు. అయితే ఆయన ఆత్మ‌హ‌త్య చేసుకుని మ‌ర‌ణించార‌ని ప్ర‌చారం సాగుతోంది. దీనిపై స‌న్నిహితులు వివ‌ర‌ణ ఇచ్చారు. కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్‌ వెళుతున్న రైలు నుంచి ఆయన ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారని తెలిసింది. వేణుగోపాల్‌కి భార్య, ఇద్దరు కుమారులున్నారు.

బుల్లితెర‌పై ప‌లు విజ‌య‌వంత‌మైన సీరియ‌ళ్ల‌ను నిర్మించిన వేణుగోపాల్ కృష్ణ‌వంశీ `న‌క్ష‌త్రం` నిర్మాత‌ల్లో ఒక‌రిగా ఉన్నారు. ఆనందో బ్రహ్మ (1996) సీరియల్‌తో నిర్మాతగా ఆయన ప్రస్థానం మొదలైంది. ప్రియురాలు పిలిచె ఆయన నిర్మించిన చివరి సీరియల్‌. దాదాపు 10 సీరియ‌ళ్ల‌ను నిర్మించగా, తులసీదళం సీరియల్‌కి నంది అవార్డు అందుకున్నారు. హీరో చిరంజీవి నటించిన తొలి టీవీ షో `విజయం వైపు పయణం`కి వేణుగోపాల్‌ నిర్మాత. ఈ షోకి యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వం వహించారు.

నేడు వేణుగోపాల్ అంత్యక్రియలు జరగనున్నాయి. వేణుగోపాల్‌ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. వేణుగోపాల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌నేదానిలో ఎలాంటి వాస్త‌వం లేద‌ని, రైలు నుంచి ప్ర‌మాద‌వ‌శాత్తూ కింద‌ప‌డి మ‌ర‌ణించార‌ని న‌క్ష‌త్రం స‌హ‌నిర్మాత‌ల్లో ఒక‌రు వెల్ల‌డించారు. వేణుగోపాల్ కి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవ‌ని కూడా తెలిపారు.