Begin typing your search above and press return to search.

విమర్శించిన ఫ్యాన్స్… థాంక్యూ చెప్పిన నిర్మాత!

ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ2 చిత్రాలతో పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి అభిషేక్ అగర్వాల్

By:  Tupaki Desk   |   25 Oct 2023 10:46 AM GMT
విమర్శించిన ఫ్యాన్స్… థాంక్యూ చెప్పిన నిర్మాత!
X

ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ2 చిత్రాలతో పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి అభిషేక్ అగర్వాల్. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాని అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్ అయ్యి ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే దసరా రేసులో వచ్చిన మూడు సినిమాలలో లియో కంటే టైగర్ నాగేశ్వరరావు బెటర్ గా ఉందని చెప్పొచ్చు.

అయితే ఈ సినిమాకి మొదటి రోజు సినిమా లెంత్ కారణంగా డివైడ్ టాక్ వచ్చింది. దీంతో రెండో రోజుకి 30 నిమిషాల సీన్స్ కట్ చేసి కొత్త ప్రింట్ తీసుకొచ్చారు. తరువాత మూవీ టాక్ కొంత మారింది. అయిన కూడా పెద్ద బ్లాక్ బస్టర్ మాత్రం అనిపించుకోలేదు. అయితే మూవీ సక్సెస్ మీట్ మాత్రం నిర్వహించారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ ని ఇప్పుడు మాస్ రాజా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

లియో సినిమా కంటే టైగర్ నాగేశ్వరరావు బాగుంది. కాని టైగర్ కంటే లియోకి ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చారు. స్క్రీన్, థియేటర్స్ కాస్తా పెంచే ప్రయత్నం చేయండి అంటూనే ఆ అభిమాని కాస్తా వల్గర్ గా విమర్శించారు.

అలాగే మరికొంత మంది నెటిజన్లు కూడా నిర్మాతని ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది శృతి మించి కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాత్రం సీరియస్ కాకుండా చాలా పద్ధతిగా, సింపుల్ గా వారికి సమాధానం ఇవ్వడం విశేషం. ఈ మధ్యకాలంలో అభిమానులు హీరోలు, నిర్మాతలు అందరిని కూడా డైరెక్ట్ గా ట్యాగ్ చేసి మరీ విమర్శలు చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో జరుగుతున్న ఇలాంటి ట్రోల్స్ పై సీరియస్ కావడం చూస్తున్నాం. కాని అభిషేక్ అగర్వాల్ మాత్రం సీరియస్ కాకుండా థాంక్యూ అనే ఒకే ఒక్క మాటతో వారికి సమాధానం ఇచ్చేయడం విశేషం. ఇప్పుడు ఇది సోషల్ మీడియా వైరల్ గా మారింది.