Begin typing your search above and press return to search.

ఆశ చూపి హ్యాండ్ ఇచ్చిన క్రేజీ కాంబినేషన్స్

సినిమా ఇండస్ట్రీలో పవర్ఫుల్ హిట్ కాంబినేషన్ లలో కొన్ని సినిమాలు అఫీషియల్ గా ఎనౌన్స్ అవుతాయి

By:  Tupaki Desk   |   15 April 2024 5:03 AM GMT
ఆశ చూపి హ్యాండ్ ఇచ్చిన క్రేజీ కాంబినేషన్స్
X

సినిమా ఇండస్ట్రీలో పవర్ఫుల్ హిట్ కాంబినేషన్ లలో కొన్ని సినిమాలు అఫీషియల్ గా ఎనౌన్స్ అవుతాయి. ప్రీప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్ లు కూడా జరుగుతాయి. తరువాత ఏవో కారణాలతో ఆ సినిమాలు ఆగిపోతాయి. కొన్ని బడ్జెట్ సమస్యలతో ఆగిపోతే మరికొన్ని ప్రాజెక్ట్స్ స్క్రిప్ట్ దశలో హోల్డ్ లో పడిపోతాయి. ఇలా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఒక డజనుకి పైగా బడా సినిమాలు అఫీషియల్ గా ఎనౌన్స్ అయిన తర్వాత ఆగిపోయాయి.

వాటిలో సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఎనౌన్స్ అయిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. రంగస్థలంకి ముందు సుకుమార్ దర్శకత్వంలో ఒక కథకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పట్టాలెక్కలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేశారు. అయితే ఏజెంట్ మూవీ ఇంపాక్ట్ ఈ సినిమాపై పడింది. సురేందర్ రెడ్డి కథని పవన్ కళ్యాణ్ హోల్డ్ లో పెట్టారని తెలుస్తోంది.

దిల్ రాజు ప్రొడక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఇక ఐకాన్ అనే సినిమాని ఎనౌన్స్ చేశారు. ఈ మూవీ ఎందుకనో అప్పట్లో హోల్డ్ లో పడింది. తరువాత దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాని వేణుశ్రీరామ్ దర్శకత్వంలో చేశారు. ఇప్పుడు ఐకాన్ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ ఉంటుందని గతంలో నాగవంశీ ప్రకటించారు. అయితే దీనిపై అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఒక సినిమాని ప్రకటించింది. అయితే ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లకి పైగా లెక్కలు తేలడంతో నిర్మాతలు డేర్ చేయలేక వెనక్కి తగ్గారు. గీతా ఆర్ట్స్ లో నాగ చైతన్య హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ పై వర్క్ చేశారు. మరి ఏమైందో సడెన్ గా పరశురామ్ ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి దిల్ రాజు క్యాంప్ లోకి వచ్చేశాడు.

చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ ఉంటుందని ప్రకటన వచ్చింది. అయితే ఈ మూవీ కథ మెగాస్టార్ కి ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాకపోవడంతో ఫైనల్ గా ఆగిపోయింది. లైగర్ రిలీజ్ కి ముందు విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కలయికలో జనగణమన అనే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. లైగర్ డిజాస్టర్ తో ఈ మూవీ ఆగిపోయింది.

సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్ లో గంజా శంకర్ అనే మూవీని ఎనౌన్స్ చేసి టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. అయితే మూవీ బడ్జెట్ ఇష్యూ కారణంగా ఆగిపోయిందని టాక్ వస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా డబుల్ డోస్ అనే మూవీ ఉంటుందనే టాక్ వచ్చింది. కానీ స్క్రిప్ట్ పర్ఫెక్ఫ్ గా అనిపించకపోవడంతో విష్ణు ధైర్యం చేయలేకపోయాడు. ఈ విధంగా ఈ మధ్య కాలంలో క్రేజీ కాంబినేషన్స్ అనౌన్స్ మెంట్స్ వరకే ఆశ చూపి కనుమరుగాయ్యాయి.