Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ మెంబర్ ని కోల్పోయాం : శ్రీను వైట్

సెలబ్రిటీస్ లో చాలామంది యానిమల్ లవర్స్ ఉన్నారని తెలిసిందే. దాదాపు సెలబ్రిటీస్ అందరు పెట్ డాగ్స్ ని పెంచుకుంటారు.

By:  Tupaki Desk   |   14 Sep 2023 8:53 AM GMT
ఫ్యామిలీ మెంబర్ ని కోల్పోయాం : శ్రీను వైట్
X

సెలబ్రిటీస్ లో చాలామంది యానిమల్ లవర్స్ ఉన్నారని తెలిసిందే. దాదాపు సెలబ్రిటీస్ అందరు పెట్ డాగ్స్ ని పెంచుకుంటారు. అయితే వాటితో పాటుగా కొన్ని పశువులను కూడా పెంచుకుంటారు. ముఖ్యంగా ఫాం హౌస్ లో ఆవులు, గేదెలు లాంటివి కూడా పెంచుకుంటుంటారు. ఫ్రీ టైం లో తమ దగ్గర ఉన్న పశువులకు, జంతువుల మీద తమ ప్రేమను చూపిస్తుంటారు. కొన్నాళ్లుగా కలిసి ఉండటం వల్ల అవి కూడా ఫ్యామిలీ లో భాగం అవుతుంటాయి. అయితే అలాంటి వాటిని కోల్పోతే ఆ బాధ వర్ణించడం కష్టం.

ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల తన ఫాం హౌస్ లో ఉండే ఆవుని కోల్పోయారని తెలుస్తుంది. తన కూతురు ఆవుకి ముద్దుగా లక్ష్మి అని పేరు కూడా పెట్టారట. 13 ఏళ్లుగా తమ కుటుంబం లో ఒకటిగా లక్ష్మి ఉంది. లక్ష్మి వెళ్లిపోవడం చాలా బాధగా ఉందంటూ ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు శ్రీను వైట్ల. తన వ్యవసాయ క్షేత్రం లో మొదటి ఆవు లక్ష్మి.. అది వెళ్లిపోవడం ఎంతో బాధగా ఉందని అన్నారు శ్రీను వైట్ల.

ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా వారికి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి. ముఖ్యంగా యానిమల్ లవర్స్ కు ఇంకా సెన్సిటివ్ గా ఉంటారు. తన ట్విట్టర్ ఖాతాలో శ్రీను వైట్ల షేర్ చేసిన ఈ విషయానికి ఆయన ఫ్యాన్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. జంతు ప్రేమికులు వాటిని సొంత ఫ్యామిలీ మెంబర్ గా చూసుకుంటారు. వాటి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతే హృదయం బరువెక్కుతుంది.

ఈమధ్యనే మహేష్ బాబు తన పెట్ డాగ్ ని కూడా కోల్పోయారు. దాని గురించి బాధపడుతూ మహేష్ కూడా ఆమధ్య సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు. లేటెస్ట్ గా శ్రీను వైట్ల కూడా తన ఫాం హౌస్ లో ఉన్న ఆవు లక్ష్మి మిస్ అయినందుకు బాధాతప్త హృదయంతో సోషల్ మీడియాలో విషయాన్ని పంచుకున్నారు.

శ్రీను వైట్ల సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే మ్యాచో హీరో గోపీచంద్ తో సినిమా మొదలు పెట్టారు. కామెడీ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాతో హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు శ్రీను వైట్ల. ఒకప్పుడు స్టార్ హీరోలకు సక్సెస్ ఇచ్చిన శ్రీను వైట్ల ప్రస్తుతం కెరీర్ లో వెనుకబడి ఉన్నారు. గోపీచంద్ సినిమా ఆయన్ను హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.