Begin typing your search above and press return to search.

వీడియో : శ్రీవారి సన్నిధిలో 'ఖుషి' స్టార్‌

ఆమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలతో వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం

By:  Tupaki Desk   |   4 March 2024 11:15 AM GMT
వీడియో : శ్రీవారి సన్నిధిలో ఖుషి స్టార్‌
X

హీరోయిన్‌ సమంత మరోసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలతో వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వీడియో లు వైరల్‌ అవుతున్నాయి.

గత ఏడాది కాలంగా సినిమా లకు దూరంగా ఉంటూ, షూటింగ్స్ కు దూరంగా ఉంటున్న సమంత తిరిగి షూటింగ్స్ కు హాజరు అవ్వబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మొదట ఆమె ఏ సినిమా షూట్‌ లో పాల్గొనబోతుంది అనేది క్లారిటీ లేదు. అయితే షూటింగ్‌ కు ముందు సమంత శ్రీవారిని దర్శించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

స్వామి వారిని దర్శించుకున్న సమయంలో సాంప్రదాయబద్దమైన వస్త్రాల్లో సమంత కనిపించింది. ఆమె లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ మధ్య మయోసైటిస్ కారణంగా మొహం లో కల లేకుండా పోయింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సమంత ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా మారిందని ఈ వీడియో లో చూస్తే అర్థం అవుతోంది.

సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామి వారిని సమంత దర్శించుకుంది. సమంతకు తిరుమల అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. సమంత వెళ్లే సమయంలో మరియు వచ్చే సమయంలో కూడా కెమెరా లు ఆమె చుట్టు ముట్టాయి.

ఆమె తదుపరి సినిమాల గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించినా కూడా ఆమె నవ్వుకుంటూ వెళ్లింది. ఆమె మీడియాతో మాట్లాడకుండానే అక్కడ నుంచి వెళ్లి పోయారు. సమంత గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా లో విజయ్ దేవరకొండకు జోడీగా నటించిన విషయం తెల్సిందే.