Begin typing your search above and press return to search.

రాజ్​తరుణ్​ 'తిరగబడరా సామి' టీజర్​.. ఎలా ఉందంటే..

అమాయకంగా ఉండే ఓ కుర్రాడు తనకు ఎదురైన పరిస్థితుల వల్ల వైలెన్స్​ దారిలోకి వెళ్తే ఎలా ఉంటుందో అనే థీమ్​తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.

By:  Tupaki Desk   |   28 Aug 2023 5:33 AM GMT
రాజ్​తరుణ్​ తిరగబడరా సామి టీజర్​.. ఎలా ఉందంటే..
X

టాలీవుడ్ యంగ్​ హీరో రాజ్ తరుణ్ మొదట్లో అందుకున్న విజయాలను ఇప్పుడు అందుకోలేక సతమతమవుతున్నాడు. సకెస్స్​ను అందుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు. ఒక్క హిట్టు కొట్టి మళ్ళీ తన క్రేజ్ పెంచుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. వరుసగా ఎన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ మనోడి లక్కు మాత్రం మారడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమాతోనైనా సక్సెస్​ను అందుకోవడానికి ఆడియెన్స్​ ముందుకు రాబోతున్నాడు.


అదే 'తిరగబడరా సామి'. ఈ చిత్రంలో రాజ్​తరుణ్​తో పాటు మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోహీరోయిన్లుగా నటించారు. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా టీజర్​ను ప్రముఖ నిర్మాత దిల్​రాజు రిలీజ్ చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఫన్నీ అండ్ యాక్షన్ సన్నివేశాలతో కట్​ చేశారు.

అమాయకంగా ఉండే ఓ కుర్రాడు తనకు ఎదురైన పరిస్థితుల వల్ల వైలెన్స్​ దారిలోకి వెళ్తే ఎలా ఉంటుందో అనే థీమ్​తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఇందులో హీరో రాజ్​తరుణ్​ ఓ పిరికివాడుగా కనిపించగా హీరోయిన్​ను మాస్​గా చూపించారు. అలాగే వీరిద్దరినీ బాలయ్య బాబు అభిమానులుగానూ చూపించారు. అన్ని వర్గాల ఆడియెన్స్​ను ఆకట్టుకునేలా బ్యూటీఫుల్ లవ్​ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్​, యాక్షన్, మాస్​ ఎలిమెంట్స్​, ఫన్​ అన్ని సినిమాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మల్వీ మల్హోత్రా ఎంతో అందంగా అలాగే మాస్​ అప్పీయరెన్స్​లోనూ బాగుంది. హీరో రాజ్​తరుణ్​ ఇనోసెంట్​గా పిరికావాడులా కనిపిస్తూనే.. చివర్లో ఫైటింగ్​ పవర్​ఫుల్​గా చేశాడు. హీరోహీరోయిన్​ మధ్య రొమాంటిక్ సీన్స్ బాగానే ఉన్నాయి. బాలయ్య సినిమా టికెట్స్​ కోసం మర్డర్​ చేసిన తప్పులేదు హీరోయిన్ డైలాగ్​ చెప్పడం హైలైట్​గా ఉంది. ఇక మకరంద్ దేశ్​పాండే విలన్ రోల్​ ఇంట్రెస్టింగ్​గా ఉంది. 'ఇది నా సామాజ్ర్యం అందరూ గంజాయి వనం అంటున్నారని ఓ తులసి మొక్కను నాటాను. అది ఇప్పుడు కనపడట్లేదు. ' అంటూ ఆయన చెప్పిన డైలాగ్​ కూడా ఆకట్టుకుంటోంది. చివరికి ట్రైలర్​ను జై బాలయ్య స్లోగాన్స్​తో ముగించారు.

ఇకపోతే ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్‌ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ కూడా బాగా ఉన్నాయి. మొత్తంగా ఓ వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని మూవీటీమ్ చెబుతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకి జె.బి సంగీతం, ఎం.ఎన్‌.జవహర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందించారు.