Begin typing your search above and press return to search.

2024 లో కొత్త భామ‌ల జోరు!

పాన్ ఇండియా చిత్రం నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తోన్న సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌ల్కి 2898 లో దీపికా ప‌దుకొణే న‌టిస్తోంది.

By:  Tupaki Desk   |   22 Jan 2024 11:30 PM GMT
2024 లో కొత్త భామ‌ల జోరు!
X

కొత్త ఏడాదిలో చాలా మంది భామ‌లు తెలుగు తెర‌పై తెరంగేట్రం చేస్తున్నారు. తొలి సినిమాతో అదృష్టాన్ని ప‌రీక్షించుకుని కెరీర్ దేదీప్య‌మానంగా సాగిపోవాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. అందులో ఫేమ‌స్ బ్యూటీలు ఎవ‌రంటే...బాలీవుడ్ భామ‌లు దీపికా ప‌దుకొణే..జాన్వీ క‌పూర్..తృప్తి డిమ్రి లాంటి భామ‌ల‌తో పాటు మానుషీ చిల్ల‌ర్..భాగ్య శ్రీ భోర్సే లాంటి భామ‌లున్నారు.

పాన్ ఇండియా చిత్రం నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తోన్న సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌ల్కి 2898 లో దీపికా ప‌దుకొణే న‌టిస్తోంది. అమ్మ‌డికిదే తొలి సినిమా. మొద‌టి సినిమాలోనే ప్ర‌భాస్ తో న‌టిస్తోంది. ఈ పెయిర్ తెర‌పై ఎంతో అందంగా క‌నిపిస్తుంద‌ని చెప్పొచ్చు. ప్ర‌భాస్ ని అన్ని ర‌కాలుగా మ్యాచ్ చేసే న‌టి దీపిక‌. అందుకే ఈ ఫెయిర్ కి ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఏర్ప‌డుతుంది. అలాగే `దేవ‌ర` సినిమాతో జాన్వీ క‌పూర్ ఎంట్రీ కూడా అంతే ఆస‌క్తిక‌రంగా ఉంది.

ఇందులో అమ్మ‌డు యంగ్ టైగ‌ర్ కి జోడీగా న‌టించ‌డంతో ఆకాంబోని తెర‌పై ఎప్పుడు చూస్తామా? అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎన్టీఆర్ -శ్రీదేవి కాంబినేష‌న్ ఎంత స‌క్సెస్ అయిందే చిన్న ఎన్టీఆర్ -జాన్వీ అంతే స‌క్సెస్ అవుతార‌ని అంచ‌నాలున్నాయి. ఈ రెండు సినిమాల త‌ర్వాత దీపిక‌.. జాన్వీ లు ఇక్క‌డ కొన‌సాగుతారా? లేదా? అన్న‌ది అంతే సస్పెన్స్ గానూ క‌నిపిస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ లో వీళ్లిద్ద‌రు బిజీ హీరోయిన్లు.

ఇక `ఆప‌రేష‌న్ వాలెంటైన్` సినిమాతో మానుషీ చిల్ల‌ర్ ఎంట్రీ ఇస్తుంది. అంద‌గ‌త్తెల పోటీలో అమ్మ‌డికి అగ్ర తాంబూలం ఇవ్వ‌డంతో మానుషీ క‌ల‌వ‌రింపు ఎక్కువ‌గానే ఉంది మార్కెట్ లో. ఈసినిమాలో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కి జోడీగా న‌టిస్తుంది. అలాగే ర‌వితేజ `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్` సినిమాతో మ‌రో బాలీవుడ్ న‌టి భాగ్య శ్రీ బోర్సే కూడా లాంచ్ అవుతుంది. ఇప్ప‌టికే అమ్మ‌డు అందంతో టాలీవుడ్ ని ఫిదా చేసింది. దీంతో ఆ బ్యూటీ తెర‌పై ఇంకెంత అందంగా క‌నిస్తుంది? అన్న ఉత్సాహం అభిమానుల్లో అప్పుడే మొద‌లైపోయింది.

ఇక `యాన‌మిల్` తో ఫేమ‌స్ అయిపోయిన తృప్తి డిమ్రి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ అమ్మ‌డికి పాన్ ఇండియాలో ఫాలోయింగ్ ఉంది. మంచి అంద గ‌త్తె. అందుకే గౌత‌మ్ తిన్న‌నూరి త‌న సినిమాలో ఛాన్స్ ఇచ్చిన‌ట్లు వినిపిస్తుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఆయ‌న ఓసినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో గెస్ట్ పాత్ర‌కి తృప్తిని తీసుకున్న‌ట్లు స‌మాచారం.