Begin typing your search above and press return to search.

12వ త‌ర‌గ‌తి ఫెయిలైనా రాశీతో ల‌వ్‌లో?

టాలీవుడ్ నుంచి సడెన్‌గా మాయ‌మైన రాశీఖ‌న్నా ఇప్పుడు ఏం చేస్తోంది? అంటే.. సైలెంట్ గా త‌న ప‌ని తాను చేసుకుపోతోంద‌ని చెప్పాలి

By:  Tupaki Desk   |   24 March 2024 7:46 AM GMT
12వ త‌ర‌గ‌తి ఫెయిలైనా రాశీతో ల‌వ్‌లో?
X

టాలీవుడ్ నుంచి సడెన్‌గా మాయ‌మైన రాశీఖ‌న్నా ఇప్పుడు ఏం చేస్తోంది? అంటే.. సైలెంట్ గా త‌న ప‌ని తాను చేసుకుపోతోంద‌ని చెప్పాలి. ఈ బ్యూటీ గేమ్ ప్లాన్ ఛేంజ్ చేసింది. ఇది ఏ రేంజులో వ‌ర్క‌వుట‌వుతోందో ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంది. రాశీ ఇక్క‌డ ద్వితీయ శ్రేణి సినిమాల్లో న‌టించాల్సి వ‌స్తే, ఇప్పుడు హిందీ చిత్ర‌సీమ‌లో క్రేజ్ ఉన్న స్క్రిప్టుల్లో న‌టిస్తూ అద‌రగొడుతోంది. ఇంత‌కుముందే సిద్ధార్థ్ మ‌ల్హోత్రా తో క‌లిసి విమానం హైజాక్ నేప‌థ్యంలో రూపొందించిన 'యోధ‌'లో న‌టించింది. ఇందులో త‌న న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బాగానే రాణిస్తోంది.

ఇంత‌లోనే 'ట్వ‌ల్త్ ఫెయిల్' న‌టుడు విక్రాంత్ మాస్సేతో క‌లిసి మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టిస్తోంది. ఇది నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న క్రేజీ చిత్రం. గుజ‌రాత్ అల్ల‌ర్లు, గోద్రాలో స‌బ‌ర్మ‌తి ట్రెయిన్ ద‌హ‌నం నేప‌థ్యంలో రూపొందుతున్న‌ సినిమా ఇది. దాదాపు 22ఏళ్ల క్రితం 59 మంది అమాయ‌కులైన రైలు ప్ర‌యాణికుల‌ను త‌గ‌ల‌బెట్టిన‌ దారుణ మార‌ణ‌కాండ నేప‌థ్యంలో రూపొందుతున్న సినిమాలో రాశీఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్లు, టీజ‌ర్ ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో కి వైర‌ల్ గా దూసుకెళ్లాయి.

ట్వ‌ల్త్ ఫెయిల్ అఖండ విజయం తర్వాత బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే 'ది సబర్మతి రిపోర్ట్' లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టిస్తూ అంద‌రి నోళ్ల‌లో నానుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ప్ర‌యోగాత్మ‌క స్క్రిప్టుల్లో అత‌డికి అవ‌కాశం ద‌క్కింది. 'యోధా'లాంటి ఆస‌క్తిక‌ర సినిమా త‌ర్వాత‌ రాశి ఖన్నాకు ఇది ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌మే. కొద్దిరోజుల క్రితం ది స‌బ‌ర్మ‌తి రిపోర్ట్ టీజ‌ర్ విడుద‌లైంది. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ శుక్రవారంతో పూర్తయింది. ఈ వార్తలను రాశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధృవీక‌రించింది. క‌థానాయ‌కుడు విక్రాంత్ కూడా సోష‌ల్ మీడియాల్లో త‌న చిత్ర దర్శకుడు రంజన్ చందేల్‌తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను కూడా పోస్ట్ చేశాడు. శుక్రవారం, రాశీ ఖన్నా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో తాజా ఫోటోల‌ను షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఒక‌దానిలో రాశీ ది సబర్మతి రిపోర్ట్స్ సెట్‌లో క‌నిపించింది. రెండవ ఫోటోలో విక్రాంత్ మాస్సే చిత్ర దర్శకుడితో క‌లిసి తాను కూడా పోజులిచ్చింది.

'ది సబర్మతి రిపోర్ట్' కథ నిజ క‌థ‌. 2002 గుజరాత్ రైల్వే దుర్ఘ‌ట‌న‌ ఆధారంగా రూపొందుతోంది. గోద్రా సంఘటన, గుజరాత్ అల్లర్ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. గ‌తంలో IPS ఆఫీసర్ మనోజ్ శర్మగా నటించిన విక్రాంత్ మాస్సే ది సబర్మతి రిపోర్ట్‌లో హిందీ జర్నలిస్ట్‌గా నటిస్తున్నాడు. విక్రాంత్- రాశితో పాటు, జవాన్ నటుడు రిద్ధి డోగ్రా కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం 3 మే 2024న భారీ స్క్రీన్ ల‌లో విడుదల కానుంది.