Begin typing your search above and press return to search.

హిట్‌ మూవీ సీక్వెల్‌ ఉంది, కానీ... హీరో క్లారిటీ

ఖైదీ 2 సినిమాకు ముందు దర్శకుడు రజినీకాంత్‌ సినిమాను ముగించాల్సి ఉంది అంటూ హీరో కార్తీ తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడు.

By:  Tupaki Desk   |   3 Nov 2023 5:39 AM GMT
హిట్‌ మూవీ సీక్వెల్‌ ఉంది, కానీ... హీరో క్లారిటీ
X

కార్తీ హీరోగా 2019 సంవత్సరం లో వచ్చిన ఖైదీ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా తోనే దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి మంచి గుర్తింపు లభించింది. తమిళ్, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌ లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి భారీ మార్కెట్‌ క్రియేట్‌ అయింది.

ఖైదీ సినిమా విడుదల అయినప్పటి నుంచి కూడా సీక్వెల్‌ గురించి చర్చ జరుగుతూనే ఉంది. లోకేష్ కనగరాజ్ నుంచి విక్రమ్‌ మరియు లియో సినిమాలు రావడంతో ఖైదీ 2 పై మరింత ఆసక్తి అంచనాలు పెరుగుతున్నాయి. లియో సినిమా ప్రమోషన్ సమయంలో ఖైదీ 2 కి అంతా రెడీగా ఉంది అన్నట్లుగా దర్శకుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.

ఖైదీ 2 సినిమాకు ముందు దర్శకుడు రజినీకాంత్‌ సినిమాను ముగించాల్సి ఉంది అంటూ హీరో కార్తీ తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడు. ఆయన హీరోగా నటించిన జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు కార్తీ మీడియాతో మాట్లాడుతూ ఖైదీ 2 గురించి క్లారిటీ ఇచ్చాడు.

ఖైదీ 2 సినిమా విషయమై లోకేష్ కనగరాజ్ మనసులో ఉంది. మా ఇద్దరి కాంబోలో ఆ సినిమా రాబోతుంది. అయితే ఇప్పటి వరకు స్క్రిప్ట్ వర్క్ జరగలేదు. లోకేష్ తన తదుపరి సినిమాను రజినీకాంత్‌ తో చేయబోతున్నారు. ఆ సినిమా తర్వాత మాత్రమే ఖైదీ 2 సినిమా ను ఆయన మొదలు పెడతాడు అంటూ కార్తీ అన్నాడు.

రజినీకాంత్ తో సినిమా ను ముగించిన తర్వాత మాత్రమే ఖైదీ 2 సినిమా యొక్క స్క్రిప్ట్‌ వర్క్ ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోని ఎన్నో పాత్రలను ఖైదీ 2 లో చూపించబోతున్నాడు. అంతే కాకుండా విక్రమ్‌ 2 మరియు లియో 2 సినిమాకు సంబంధించిన లీడ్స్ ను కూడా ఖైదీ 2 లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఖైదీ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.