Begin typing your search above and press return to search.

హృతిక్ -తార‌క్ ఫైట్ 'దేవ‌ర' త‌ర్వాతే!

మ‌త్స‌కార నేప‌థ్య స్టోరీ లో తార‌క్ పాత్ర‌ని ఆద్యంతం మాస్ గా మల‌చ‌డంతో? యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం మునుప‌టి చిత్రాల‌కంటే ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల్సి వ‌స్తోంది.

By:  Tupaki Desk   |   13 April 2024 5:30 PM GMT
హృతిక్ -తార‌క్ ఫైట్ దేవ‌ర త‌ర్వాతే!
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `వార్ -2` సెట్స్ లో జాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే. తార‌క్ ఎంట్రీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ఉంటుంద‌ని తెలుస్తోంది. స్పై థ్రిల్ల‌ర్ కావ‌డంతో! అందుకోసం తార‌క్ గ‌ట్టిగానే క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌ని చెప్పొచ్చు. ఇప్ప‌టికే దేవ‌ర కోసం అలాగే శ్ర‌మించాల్సి వ‌చ్చింది. మ‌త్స‌కార నేప‌థ్య స్టోరీ లో తార‌క్ పాత్ర‌ని ఆద్యంతం మాస్ గా మల‌చ‌డంతో? యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం మునుప‌టి చిత్రాల‌కంటే ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల్సి వ‌స్తోంది.

తాజాగా వార్ -2 కోసం కూడా అదే క‌ష్టాన్ని కంటున్యూ చేయాల్సిన స‌న్నివేశం క‌నిపిస్తుంది. మే 1 నుంచి కియారా అద్వాణీ కూడా `వార్ -2` లో జాయిన్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె యాక్ష‌న్ సన్నివేశాల‌కు సంబంధించి శిక్ష‌ణ తీసుకుంటుంది. కియారా స్పై యూనివ‌ర్శ్ లోకి ఎంట‌ర్ అయిన నాటి నుంచి యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌రణ ఉంటుంద‌ని తెలుస్తోంది. దీనిలో భాగంగా తార‌క్ తోనూ ఆమె ఫైటింగ్ లు చేస్తుంద‌ని గ‌ట్టిగానే ప్ర‌చారం సాగుతోంది.

ఇక ఎన్టీఆర్-హృతిక్ పాత్ర‌లు ఎంత ధీటుగా ఉంటాయ‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. రెండు పాత్ర‌లు నువ్వా? నేనా? అన్న రేంజ్ లో సాగుతాయి. ఇద్ద‌రి మ‌ధ్య యాక్ష‌న్ స‌న్నివేశాలు పీక్స్ లోనే ఉంటాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓ నెల‌రోజుల క్రితం నుంచే తార‌క్-హృతిక్ మ‌ధ్య కొన్ని ఏరియాల్ యాక్ష‌న్ సీక్వెన్సెస్ చిత్రీక‌రిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. కానీ ఇంత‌వ‌ర‌కూ అది జ‌ర‌గలేదు. తాజాగా తార‌క్ హాజ‌ర‌వుతోన్న నేప‌థ్యంలో వాటినిప్పుడే చిత్రీక‌రిస్తారా? ఇంకా స‌మ‌యం ప‌డుతుందా? అన్న‌ది మ‌రో డౌట్.

ఎందుకంటే? తారక్ ఈ షెడ్యూ ల్ లో ఎక్కువ రోజులు పాల్గొన‌డు. కొన్ని రోజుల షూట్ ముగించుకుని మ‌ళ్లీ దేవ‌ర‌కి హాజ‌ర‌వుతాడు. హృతిక్ తో యాక్ష‌న్ స‌న్నివేశాలంటే కంటూన్యూగా చేయాల్సి ఉంటుంది. ఆ స‌న్నివేశాల్లో తార‌క్ పాల్గొనాలంటే `దేవ‌ర` రిలీజ్ త‌ర్వాతే ఉంటుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఈ గ్యాప్ లో కియారాతో..ఇతర‌ న‌టీన‌టుల‌తో తార‌క్ పై స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నార‌ని ముంబై మీడియాలో ప్ర‌చారం సాగుతోంది.