Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్.. ఎంత వరకు వచ్చిందంటే?

తెలుగులో సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాను హిందీ సహా పలు భాషల్లో అప్పట్లో రీమేక్ చేశారు.

By:  Tupaki Desk   |   4 April 2024 11:30 PM GMT
డబుల్ ఇస్మార్ట్.. ఎంత వరకు వచ్చిందంటే?
X

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్.. ఆడియన్స్ ను ఎంతలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. 2019లో రిలీజైన ఈ చిత్రం.. రామ్ పోతినేని కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. మణిశర్మ అందించిన మ్యూజిక్ ఆల్బమ్ హైలైట్ అని చెప్పవచ్చు. తెలుగులో సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాను హిందీ సహా పలు భాషల్లో అప్పట్లో రీమేక్ చేశారు.

ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈసారి ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అన్నీ డబుల్ ఇవ్వడానికి వస్తున్నామని రామ్ ఇప్పటికే చెప్పారు. ఈ సినిమాకి దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పూరి జగన్నాథ్ వ్యవహరిస్తున్నారు. తన ఓన్ బ్యానర్ పూరి కనెక్ట్స్ పై హీరోయిన్ ఛార్మి తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీక్వెల్ కు కూడా మణిశర్మనే మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇస్మార్ట్ శంకర్ లో ఫుల్ స్టైలిష్ గా కనిపించిన హీరో రామ్.. ఇక డబుల్ ఇస్మార్ట్ లో మరింత స్టైలిష్ గా సందడి చేయనున్నారని టాక్. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ మూవీ.. శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా చేశారు. సమ్మర్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు.

కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల రామ్ ఈ సినిమా విడుదలపై ఓ కార్యక్రమంలో స్పందించారు. జూన్ లో రిలీజ్ ఉంటుందని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారు అయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జూన్ 14వ తేదీన ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారట. హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంకా 5-10 పది రోజుల షూటింగ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉందట. రెండు పాటలు, ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ తప్ప మిగతా పార్ట్ అంతా పూర్తి అయిందని సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించి ప్రమోషన్లు స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండగా.. హీరోయిన్ ఎవరనేది ఇంకా సస్పెన్స్ గా ఉంచారు మేకర్స్. మొత్తానికి ఈ మూవీతో రామ్, పూరి ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.