Begin typing your search above and press return to search.

పాపం.. ఆ గాయం ఇంకా మానలేదు

అయితే యాక్సిడెంట్‌ తాలూకు గాయాలు, ఇబ్బందులు ఇంకా సాయి ధరమ్ తేజ్ ను వేధిస్తూనే ఉన్నాయని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   6 Jan 2024 11:08 AM IST
పాపం.. ఆ గాయం ఇంకా మానలేదు
X

2021 సెప్టెంబర్‌ లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన విషయం తెల్సిందే. యాక్సిడెంట్‌ నుంచి తేరుకున్న సాయి ధరమ్ తేజ్ మళ్లీ సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉన్నాడు. అయితే యాక్సిడెంట్‌ తాలూకు గాయాలు, ఇబ్బందులు ఇంకా సాయి ధరమ్ తేజ్ ను వేధిస్తూనే ఉన్నాయని తెలుస్తోంది.

తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో కలిసి రౌండ్ టేమ్ సమావేశం లో పాల్గొన్నారు. ఆ సమయంలో సాయి ధరమ్‌ తేజ్ తో మాట్లాడించిన సమయంలో ఆయన గొంతు వద్ద గాయం క్లియర్ గా కనిపిస్తుంది.

ఆ గాయం కారణంగా సాయి ధరమ్‌ తేజ్ ఇంకా పూర్తి స్థాయిలో మాట్లాడలేక పోతున్నాడు. అంతే కాకుండా ఆయన గతంలో మాదిరిగా క్లియర్ గా కూడా డైలాగ్స్ ను చెప్పలేక పోతున్నాడు అంటూ ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు.

సాయి ధరమ్‌ తేజ్ చలాకీగా మాట్లాడుతూ ఉన్నట్లుగా అనిపించినా, అందరితో చలాకీగా ఉన్నట్లుగా అనిపించినా కూడా ఆయనను రెండేళ్లు దాటినా కూడా యాక్సిడెంట్‌ తాలూకు గాయాలు, జ్ఞాపకాలు ఇబ్బందికి గురి చేస్తున్నాయని ఈ వీడియోను చూస్తే అర్థం అవుతుంది.

ఇక సాయి ధరమ్‌ తేజ్ విరూపాక్ష సినిమా తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దాదాపుగా వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన ఆ సినిమా తర్వాత సాయి ధరమ్‌ తేజ్ కొత్త సినిమా ఏర్పాట్లలో ఉన్నాడు. త్వరలోనే తేజ్ నుంచి కొత్త సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.