Begin typing your search above and press return to search.

ప్రేమికుల రోజుపై మెగా హీరో అలా అనేశాడు!

ఇటీవ‌లే విరూపాక్ష‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకున్న సాయిధ‌ర‌మ్, ప‌వ‌న్ మావ‌య్య‌తో క‌లిసి బ్రో అనే సినిమాలోను న‌టించాడు.

By:  Tupaki Desk   |   14 Feb 2024 4:11 PM GMT
ప్రేమికుల రోజుపై మెగా హీరో అలా అనేశాడు!
X

ప్రేమికుల దినోత్సవం!! అంటూ ప్రేమికుల కోసం ఒక రోజును కేటాయించారు. దీనర్థం ఈ ఒక్క రోజూ ప్రేయ‌సీ ప్రియులు ఒక‌రికోసం ఒక‌రుగా జీవించాలా? ఇలాంటి సందేహాన్నే వ్య‌క్తం చేసాడు సాయిధ‌ర‌మ్ తేజ్. ``ఈరోజు వాలెంటైన్స్ డే అంట. మరి రేపు ఏంటి..? కాబట్టి అందుకే ప్రతి ఒక్క రోజుని మీకు ఇష్టమైన వారితో స్పెషల్ గా సెల‌బ్రేట్ చేయండి!`` అంటూ సాయి ధరమ్ పోస్ట్ వేశారు. ఈ పోస్ట్ చూడ‌గానే `సోలో బ్రతుకే సో బెటర్`లో స‌న్నివేశం గుర్తుకు వ‌స్తోంది. అందుకే నెటిజ‌నులు ఆ సినిమాని గుర్తు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇటీవ‌లే విరూపాక్ష‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకున్న సాయిధ‌ర‌మ్, ప‌వ‌న్ మావ‌య్య‌తో క‌లిసి బ్రో అనే సినిమాలోను న‌టించాడు. ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు చ‌క్క‌ని వ‌సూళ్లు ద‌క్కాయి. త‌దుప‌రి సంపత్ నంది దర్శకత్వంలో `గంజా శంకర్` అనే మాస్ యాక్ష‌న్ సినిమాలో న‌టిస్తున్నాడు. తెలంగాణ నేప‌థ్యంలోని చిత్ర‌మిది. కానీ ఈ సినిమా చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింద‌ని, బ‌డ్జెట్ ప‌ర‌మైన ఇష్యూస్ త‌లెత్తాయ‌ని గుస‌గుస వినిపిస్తోంది. అయితే దీనికి అధికారిక ధృవీక‌రణ ఏదీ లేదు.

స‌ర్జ‌రీ వ‌ల్ల విరామం

హైద‌రాబాద్ కేబుల్ బ్రిడ్జిపై మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ అనంత‌రం అత‌డు కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. విరూపాక్ష - బ్రో సినిమాల్లో న‌టించాడు కానీ అప్ప‌టికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం అత‌డు ఇంకా విరామంలోనే ఉన్నాడు. యాక్సిడెంట్ తరువాత ఇటీవ‌లే మరో సర్జరీ చేసారు. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా అందిన స‌మాచారం మేర‌కు.. ప్ర‌స్తుతం కోలుకుని తిరిగి యాక్ష‌న్ మోడ్ లోకి రాబోతున్నాడ‌ని కూడా తెలిసింది.