Begin typing your search above and press return to search.

ధృవ సీక్వెల్ అనౌన్స్​మెంట్​.. ఉత్కంఠగా ప్రోమో

గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్‌ రాజా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం తని ఒరువన్‌. ఈ చిత్రంలో ఆయన తమ్ముడు జయం రవిని హీరో నటించారు

By:  Tupaki Desk   |   29 Aug 2023 10:10 AM GMT
ధృవ సీక్వెల్ అనౌన్స్​మెంట్​.. ఉత్కంఠగా ప్రోమో
X

గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్‌ రాజా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం తని ఒరువన్‌. ఈ చిత్రంలో ఆయన తమ్ముడు జయం రవిని హీరో నటించారు. ఈ సినిమా 8ఏళ్ల క్రితం విడుదలై తమిళనాట సంచలన రికార్డులను అందుకుంది. ఇక ఇదే చిత్రాన్ని రామ్‌చరణ్‌ ధృవగా రీమేక్‌ చేసి ఇక్కడ సూపర్ హిట్ అందుకున్నారు. సురేంద్ర రెడ్డి దీన్ని డైరెక్ట్ చేశారు. అయితే ఇప్పుడీ సినిమాకు సీక్వెల్​ను ప్రకటించారు మేకర్స్​. ఓ స్పెషల్ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు.

మొదటి భాగంలో హీరో.. సిద్దార్థ్‌ అభిమన్యను విలన్‌గా సెలక్ట్​ చేసుకుని ఆయన ఏర్పరుచుకున్న సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తాడు. అయితే సీక్వెల్‌లో మాత్రం హీరో విలన్‌ను వెతకడం కాకుండా.. విలనే హీరోను వెతుక్కుంటూ వస్తాడని అంటూ సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు.

తని ఒరువన్‌లో 'నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే, నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే, నీ సామర్థ్యం తెలుస్తుంది' అంటూ హీరో క్యారెక్టర్​ను ఎలివేట్ చేయగా.. ఇప్పుడు సీక్వెల్‌లో 'నీ లోని నిజాన్ని నాకు చూపించు. నీ శత్రువు ఎవరో నేను చెబుతాను' అంటూ మూవీ థీమ్​ను చూపించారు. మొత్తంగా ఈ గ్లింప్స్​ ఉత్కంఠగ రేకెత్తిస్తోంది.

అయితే మొదటి భాగంలో విలన్​గా అరవింద్‌ స్వామి నటన అద్భుతం. ఈ సినిమా సక్సెస్‌లో ఆయనదే కీలక పాత్ర అని చెప్పొచ్చు. స్క్రీన్‌పై ఆయన కనిపించిన ప్రతీ సీన్​.. ఆడియెన్స్​ను సీట్‌ ఎడ్జ్‌పై కూర్చొబెట్టింది. అందుకే తెలుగు రీమేక్​లోనూ ఆయన్నే విలన్‌గా పెట్టారు. మరి ఇప్పుడు సీక్వెల్‌లో ఆ రేంజ్​లో విలన్‌గా ఎవరు నటిస్తారనే ఆసక్తికరంగా మారింది.

ఈ చిత్రాన్ని కూడా మొదటి భాగం నిర్మించిన ఏజీఎస్‌ సంస్థే.. నిర్మిస్తుంది. నయనతార హీరోయిన్‌గా కనిపించనుంది. సంగీత దర్శకుడు హిప్ హాప్‌ ఉంటాడా లేదా అనే స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుంటుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమా రిలీజ్‌ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.