Begin typing your search above and press return to search.

'త‌ని ఒరువన్ 2' సెట్స్‌పైకి.. చ‌ర‌ణ్‌ 'ధృవ 2' చేస్తాడా?

ఇరైవన్ తర్వాత జయం రవి స‌ర‌స‌న‌ నయనతార చాలా కాలానికి న‌టించ‌నుంది. 2024లో షూటింగ్ ప్రారంభం కానుంది

By:  Tupaki Desk   |   29 Aug 2023 4:07 AM GMT
త‌ని ఒరువన్ 2 సెట్స్‌పైకి.. చ‌ర‌ణ్‌ ధృవ 2 చేస్తాడా?
X

గొప్ప క‌థ.. దానికి త‌గ్గట్టు మెస్మ‌రైజ్ చేసే స్క్రీన్ ప్లే.. ప్ర‌ధాన పాత్ర‌ధారుల అద్భుత న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న..ఉన్న‌త‌ నిర్మాణ విలువ‌లు.. ఉత్త‌మ సంగీతం.. ఇలా అన్నివిధాలా ప్రేక్ష‌కుల‌ను స‌మ్మోహ‌నానికి గురి చేసిన చిత్రం 'త‌ని ఒరువ‌న్‌'. జయం రవి క‌థానాయ‌కుడిగా మోహ‌న్ రాజా తెర‌కెక్కించిన ఈ త‌మిళ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత ఇదే సినిమాని సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ధృవ పేరుతో తెలుగులో రీమేక్ చేసారు. రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. అంతేకాదు 'రంగ‌స్థ‌లం' లాంటి వైవిధ్య‌మైన సినిమాలో న‌టించిన రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌ కి ధృవ మ‌ర‌పురాని ఒక క్లాసిక్ సినిమా అన‌డంలో సందేహం లేదు. ధృవ పాత్ర‌లో హీరోయిజాన్ని పీక్స్ లో ఎలివేట్ చేసారు సురేంద‌ర్ రెడ్డి. అత‌డి ప‌నిత‌నానికి గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

అయితే అప్ప‌ట్లోనే దర్శకుడు మోహన్ రాజా 'త‌ని ఒరువ‌న్' సీక్వెల్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. 'త‌ని ఒరువన్ 2' సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని కూడా ప్ర‌చార‌మైంది. కానీ అది ఆల‌స్య‌మైంది. ఎట్టకుల‌కే మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ జయం రవి - మోహన్ రాజా కాంబినేష‌న్ లో సెట్స్ పైకి వెళుతోంది. ఈ సినిమా మొద‌టి భాగం కంటే ఎక్కువ ఎగ్జ‌యిట్ చేస్తుంద‌ని కూడా ప్ర‌క‌టించారు. తాజాగా టీజ‌ర్ రిలీజైంది. AGS ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానప్ లో ఈ సినిమా నిర్మాణం ప్రతిష్టాత్మకంగా ఉంటుందని ద‌ర్శ‌కుడు హామీ ఇచ్చారు.

ఇరైవన్ తర్వాత జయం రవి స‌ర‌స‌న‌ నయనతార చాలా కాలానికి న‌టించ‌నుంది. 2024లో షూటింగ్ ప్రారంభం కానుంది. తెలుగు-త‌మిళ‌ భాష‌ల్లో అద్భుత విజ‌యం సాధించిన త‌ని ఒరువ‌న్ కు సీక్వెల్ తెర‌కెక్కుతోంది అన‌గానే స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. త‌ని ఒరువ‌న్ 2 స్టోరి- స్క్రీన్ ప్లే మొద‌టి భాగంతో పోలిస్తే మ్యాచ్ అవుతుందా? అన్న‌ది వేచి చూడాలి. ఈ సీక్వెల్ కి ప్యార‌ల‌ల్ గా రామ్ చ‌ర‌ణ్ ధృవ‌2లో న‌టిస్తే బావుంటుంద‌ని అభిమానులు కోరుకుంటున్నారు.