Begin typing your search above and press return to search.

'తండేల్' రాజులమ్మ జాతర.. సౌండ్ మామూలుగా లేదు

తాజాగా శ్రీకాకుళంలో మత్స్యకారులు చేసుకునే రాజులమ్మ జాతర విజువల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నిజంగా జరిగే మత్స్యకారుల పండగ అని, ఫిక్షన్ కాదని క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   31 March 2024 8:00 AM GMT
తండేల్ రాజులమ్మ జాతర.. సౌండ్ మామూలుగా లేదు
X

నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ తండేల్. ఈ మూవీ షూటింగ్ పెద్దగా గ్యాప్ లేకుండా పక్కా ప్రణాళికతో కొనసాగుతోంది. ఏకంగా 60 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. చాలా గ్యాప్ తర్వాత సాయి పల్లవి చేస్తున్న సినిమా కావడంతో ఆమె ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మూవీ కథ శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ముందుగానే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో ఈ కథని సిద్ధం చేసారంట. శ్రీకాకుళంలో మత్స్యకారులు వేట కోసం సముద్రంపైకి వెళ్తూ ఉంటారు. అలా వెళ్లే క్రమంలో ఒక్కో సారి పాకిస్థాన్ సరిహద్దుల్లోకి వెళ్లి అక్కడి నేవీ సిబ్బందికి ఖైదీలుగా చిక్కుకుంటారు. ఇలాంటి సంఘటనలు చాలా సార్లు ఉత్తరాంధ్ర సముద్ర తీరంలో జరిగాయి.

ఇప్పటికి చాలా మంది మత్స్యకారులు పాకిస్థాన్ జైళ్లలో ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు. వారి జీవితాలు, నిజజీవిత అనుభవాల నుంచి తీసుకొని ఈ కథని సిద్ధం చేశారు. కథ సిద్ధం అయిన తర్వాత కూడా హీరో నాగ చైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి, నిర్మాత బన్నీ వాస్ ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడి మత్స్యకారుల జీవనశైలి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉంటే ఆ మధ్యకాలంలో తండేల్ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగ చైతన్య రాజులమ్మ జాతరే అంటూ ఒక డైలాగ్ చెబుతాడు. ఈ డైలాగ్ భాగా వైరల్ అయ్యింది. తాజాగా శ్రీకాకుళంలో మత్స్యకారులు చేసుకునే రాజులమ్మ జాతర విజువల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నిజంగా జరిగే మత్స్యకారుల పండగ అని, ఫిక్షన్ కాదని క్లారిటీ ఇచ్చారు.

సినిమాలో కూడా ఈ జాతరకు సంబంధించిన విజువల్స్ హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ జాతరలో తండేల్ కు సంబంధించిన బ్యానర్లు కనిపించడం విశేషం. ఇక అక్కడి ప్రజలు సినిమాపై ప్రేమతో నాగచైతన్యపై అభిమానంతో ప్రమోట్ చేయడం విశేషం. దర్శకుడు కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే వీడియో చివర్లో చందూ మొండేటి త్వరలో శ్రీకాకుళంలో తండేల్ మూవీ షూటింగ్ కోసం రాబోతున్నట్లు చెప్పాడు.

రాజులమ్మ జాతరే అంటూ చందూ మొండేటి చెప్పే డైలాగ్ తో వీడియో ముగిసింది. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. అలాగే జాతరలో చైతన్య, సాయి పల్లవి ఫోటోలతో ఉన్న బ్యానర్లు వీడియోలో కనిపిస్తూ ఉండటం విశేషం. రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.