Begin typing your search above and press return to search.

బాలీవుడ్ హీరోతో మరో తెలుగు డైరెక్టర్

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో తెలుగు దర్శకులు సత్తా చాటుతున్నారు. అక్కడ హిట్స్ కొడుతూ తమ టాలెంట్ పరిచయం చేసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   8 Dec 2023 4:14 AM GMT
బాలీవుడ్ హీరోతో మరో తెలుగు డైరెక్టర్
X

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో తెలుగు దర్శకులు సత్తా చాటుతున్నారు. అక్కడ హిట్స్ కొడుతూ తమ టాలెంట్ పరిచయం చేసుకుంటున్నారు. తాజాగా యానిమల్ మూవీతో బాలీవుడ్ మొత్తం షేక్ అయ్యేలా సందీప్ రెడ్డి వంగా చేశాడు. విమర్శకుల ప్రశంసలు సైతం ఈ సినిమాతో సొంతం చేసుకుంటున్నాడు.

అలాగే ఈ సినిమా ద్వారా ఈ ఏడాది బాలీవుడ్ లో షారుఖ్ తో సమానంగా భారీ కలెక్షన్స్ ని రణబీర్ కపూర్ కి అందిస్తున్నాడు. యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఏ హీరో అయిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మూవీ చేయాలని అనుకోవడం ఖాయం. అంతా ప్రభావం చూపించారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు.

ఈ ఏడాది గద్దర్ 2తో సూపర్ హాట్ కొట్టిన సన్నీ డియోల్ తో క్రాక్, వీరసింహా రెడ్డి లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఉన్న గోపిచంద్ మలినేని మూవీ ప్లాన్ చేస్తున్నారు. గతంలో సన్నీ డియోల్ కి గోపీచంద్ కథ నేరేట్ చేసాడంట. ఈ కథ అతనికి భాగా నచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కూడా ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంట.

దీంతో సన్నీ డియోల్ కూడా తనకి కరెక్ట్ గా సరిపోయే స్టొరీ అని ఫిక్స్ అయ్యి గోపీచంద్ దర్శకత్వంలో మూవీ చేయడానికి రెడీ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. నిజానికి గోపీచంద్ మైత్రీ మూవీ మేకర్స్ లోనే రవితేజతో సినిమా చేయాల్సి ఉండే. అయితే బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోతుందని ఆ ప్రాజెక్ట్ ఆపేశారు. ఇప్పుడు ఆ స్థానంలో గోపీచంద్ మైత్రీతో సన్నీ డియోల్ మూవీ చేయబోతున్నాడని టాక్.

ఈ మూవీ సెట్ అయితే మాత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే రిప్రజెంట్ చేసే అవకాశం ఉంది. అలాగే బాలీవుడ్ లో షారుఖ్, రణబీర్ కపూర్ తర్వాత సన్నీ డియోల్ కి ఒక మార్కెట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది అనేది వేచి చూడాలి.