Begin typing your search above and press return to search.

తేజ సజ్జాపై ఈసారి డబుల్ బడ్జెట్..

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఏకంగా 40 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్తిక్ ఘట్టమనేని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో రవితేజతో ఈగల్ మూవీ చేశారు.

By:  Tupaki Desk   |   6 April 2024 4:59 AM GMT
తేజ సజ్జాపై ఈసారి డబుల్ బడ్జెట్..
X

హనుమాన్ మూవీతో యంగ్ హీరో తేజ సజ్జా ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఓ విధంగా చెప్పాలంటే స్టార్ హీరోగా తేజ మారిపోయాడు. పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు భారీ బడ్జెట్ లో తేజ సజ్జాతో హీరోగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అతని మూవీ సెలక్షన్ చాలా కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉందనేది సినీ విశ్లేషకుల మాట.

హనుమాన్ కి ముందు తేజ చేసిన ఐదు సినిమాలలో ఒక జాంబి రెడ్డి మాత్రమే చెప్పుకోదగ్గ మూవీగా ఉంది. మిగిలిన ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. హనుమాన్ మూవీ దేశ వ్యాప్తంగా 300 కోట్లు కలెక్ట్ చేసి అతన్ని స్టార్ ని చేసింది. అయితే ఇది వచ్చిన టైమింగ్ డైరెక్టర్ మేకింగ్ ఇలా అన్ని అంశాలు హెల్ప్ అయ్యాయి. ఇక తేజా సజ్జా నెక్స్ట్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. దీనికి మిరాయ్ అనే టైటిల్ ఫిక్స్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఏకంగా 40 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్తిక్ ఘట్టమనేని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో రవితేజతో ఈగల్ మూవీ చేశారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయిన కానీ మరోసారి భారీ బడ్జెట్ తో తేజ సజ్జా హీరోగా సినిమాని చేస్తూ ఉండటం విశేషం. నిజానికి ముందుగా ఈ సినిమాని మినిమమ్ బడ్జెట్ తోనే అనుకున్నారంట.

అయితే హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తేజ సజ్జా ఇమేజ్ పెరిగింది. ఈ కారణంతో సినిమాని గ్రాండియర్ గా పాన్ ఇండియా రేంజ్ లోనే తీయాలని ప్లాన్ చేసారంట. దీంతో బడ్జెట్ పరిధి కూడా పెరిగిందని తెలుస్తోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీని కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. హనుమాన్ ఆరంభ బడ్జెట్ కంటే ఇది రెట్టింపు అని చెప్పాలి. నిజానికి హనుమాన్ సినిమాని 15 కోట్ల బడ్జెట్ తోనే ప్రశాంత్ వర్మ స్టార్ట్ చేశాడు.

తరువాత విఎఫ్ఎక్స్ షాట్స్, సీక్వెన్స్ పెరగడంతో బడ్జెట్ పెరిగింది. అయిన కూడా హనుమాన్ కు హై రేంజ్ లో ఖర్చు పెట్టలేదు. అయితే ఇప్పుడు కార్తిక్ తో చేయబోతున్న సినిమా కోసం ఆరంభంలోనే 40 కోట్ల బడ్జెట్ ఫిక్స్ చేయడం విశేషం. ఈ సినిమాలో రితిక నాయర్ హీరోయిన్ గా ఖరారైంది. అశోకవనంలో అర్జున కళ్యాణం, హాయ్ నాన్న సినిమాలలో రితిక్ నటించింది. ఈ రెండు సినిమాలు నటిగా ఆమెకి మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే ఈ సారి మాత్రం పెద్ద ప్రాజెక్ట్ లో మెయిన్ హీరోయిన్ గా ఖరారు కావడం విశేషం.