Begin typing your search above and press return to search.

#Me Too తనుశ్రీ దత్తా మ‌ళ్లీ FIR!

Me Too ఉద్య‌మంలో తనుశ్రీ దత్తా పేరు మార్మోగిన సంగతి తెలిసిందే. సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్ త‌న‌ని హింసించాడ‌ని, వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని తీవ్రంగా ఆరోపించింది త‌నూశ్రీ‌.

By:  Tupaki Desk   |   13 Oct 2023 2:30 PM GMT
#Me Too తనుశ్రీ దత్తా మ‌ళ్లీ FIR!
X

2018లో మీ టూ సమయంలో ఆమె "మానసిక గాయం" కలిగించిందని ఆరోపించింది రాఖీ సావంత్ తనపై తప్పుడు, పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని, దీంతో తన ఇమేజ్, ప్రతిష్ట దెబ్బతింటుందని తనుశ్రీ దత్తా ఆరోపించింది.

#Me Too ఉద్య‌మంలో తనుశ్రీ దత్తా పేరు మార్మోగిన సంగతి తెలిసిందే. సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్ త‌న‌ని హింసించాడ‌ని, వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని తీవ్రంగా ఆరోపించింది త‌నూశ్రీ‌. ఈ కేసులో సుదీర్ఘ కాలం విచార‌ణ సాగిన సంగతి తెలిసిందే. చాలా కాలానికి మ‌ళ్లీ త‌నూశ్రీ పేరు మ‌ళ్లీ మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చింది. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా రాఖీ సావంత్‌పై ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయ‌డంతో మ‌రోసారి త‌న పేరు హెడ్ లైన్స్ లో హైలైట్ అయింది. 2018లో జరిగిన మీ టూ ఉద్యమంలో రాఖీ సావంత్ తన మానసిక గాయానికి కారణమైంద‌ని దత్తా ఆరోపించింది.

రాఖీ సావంత్ తనపై చాలా తప్పుడు ప్ర‌చారం సాగించింద‌ని, పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసింద‌ని త‌నూశ్రీ ఆరోపించారు. రాఖీ ప్ర‌చారం తన పేరును చెడ‌గొట్టి కెరీర్‌ను దెబ్బతీసిందని దత్తా చెప్పింది. తనను అప్రతిష్టపాలు చేసేందుకు, తన కెరీర్‌ను నాశనం చేసేందుకు రాఖీ సావంత్‌ కుట్రలో భాగమైంద‌ని కూడా ఆమె ఆరోపించింది. తనకు మరింత హాని జరగకుండా కాపాడుకోవడానికి, న్యాయం జరిగేలా రాఖీ సావంత్‌పై ఈ చట్టపరమైన చర్య తీసుకుంటున్నట్లు దత్తా తెలిపారు. బెదిరింపు లు, వేధింపులకు గురైన ఇతర బాధితులు తమ హక్కుల కోసం మాట్లాడాలని, పోరాడాలని త‌నూశ్రీ ఈ సంద‌ర్భంగా మ‌రోసారి కోరారు.

మీడియా ఇంటర్వ్యూలో త‌నూశ్రీ‌ దత్తా మాట్లాడుతూ,-"2018లో మీ టూ ఉద్యమం సందర్భంగా రాఖీ సావంత్‌కు ఎదురైన మానసిక గాయం కారణంగా ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి వచ్చాను. ఎఫ్‌ఐఆర్‌లో వివిధ కారణాలతో అనేక శిక్షాస్మృతులు అమ‌ల‌వుతాయి. రాఖీ నాకు వ్యతిరేకంగా ఇచ్చిన ప్రతి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసాము. ఈసారి వారు తప్పించుకోలేరు. ఇప్పుడు ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు త్వరలో చర్య తీసుకుంటారు. పూర్తి విష‌యాల‌ను నేను వారికి అందుబాటులో ఉంచాను" అని అన్నారు. అసలేం జరిగిందో కూడా త‌నూశ్రీ‌ దత్తా షేర్ చేసారు. నేపధ్యం ఏమిటంటే, హార్న్ ఓకే ప్లీజ్ సినిమా షూటింగ్ సమయంలో మొదట రాఖీని తీసేసి నన్ను సినిమాలో చేర్చుకున్నారు. ఆ తర్వాత నానా పటేకర్‌తో వివాదం తర్వాత మళ్లీ రాఖీని వెనక్కి తీసుకున్నారు. అందుకే ఇదో ప్లాన్.. నా పేరును ఉపయోగించి సినిమాకు ప్రచారం చేసుకున్నారు. వారు నా చెక్కులన్నింటినీ బౌన్స్ చేశారు. అంతా ప్లాన్ చేసారు. రాఖీ అందులో భాగమైంది.. అని తెలిపారు.

రాఖీ సావంత్ ప్రకటనల వల్ల తాను ఎదుర్కొన్న మానసిక క్షోభ గురించి కూడా త‌నూశ్రీ‌దత్తా చెప్పింది. రాఖీ వల్ల నేను చాలా ఎమోషనల్‌, సైకలాజికల్‌ ట్రామాను చవిచూశాను.. ఆమె నా గురించి ఇలాంటి భయంకరమైన మాటలు చెప్పింది.. తట్టుకోలేకపోయాను.. ప్రతి సంవత్సరం ఓ కొత్త నాటకం వెలుగులోకి తెస్తోంది. నా పరువు మొత్తం తీస్తోంది. ఆమె నా వ్యక్తిగత జీవితంపై దాడి చేసింది, ఆమె కారణంగా నేను పెళ్లి చేసుకోలేకపోయాను. రాఖీ చాలా కాలంగా నన్ను ఇబ్బంది పెట్టింది... అని త‌నూశ్రీ ఆవేద‌న చెందారు. ఆస‌క్తిక‌రంగా త‌నూశ్రీ ఆరోప‌ణ‌ల్లో `అత‌డు త‌ప్పించుకోలేడు.. ఇప్పుడే మొద‌లైంది!" అంటూ మ‌ళ్లీ బిగ్ షాకిచ్చింది. ఇది చూస్తుంటే మ‌రోసారి నానా ప‌టేక‌ర్ పై మ‌ళ్లీ బిగ్ ఫైట్ కి రెడీ అవుతోంద‌ని అర్థం చేసుకోవాల్సి వ‌స్తోంది.

బెదిరింపులు, వేధింపులకు గురైన ఇతర బాధితులు తమ హక్కుల కోసం మాట్లాడాలని.. పోరాడాలని త‌నూశ్రీ దత్తా కోరారు. ప్రజలు కళ్ళు తెరిచి రాఖీ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా కెరీర్ చాలా బాగా సాగుతోంది. కానీ నాపై బుర‌ద‌జ‌ల్ల‌డంతో దానిని పూర్తిగా నాశనం చేసింది... అని ఆరోపించారు ద‌త్తా.