Begin typing your search above and press return to search.

సలార్ తో తండేల్ సర్ ప్రైజ్ ప్లాన్

అతని సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Dec 2023 4:30 PM GMT
సలార్ తో తండేల్ సర్ ప్రైజ్ ప్లాన్
X

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో 'తండేల్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాని గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. 2018 సంవత్సరంలో శ్రీకాకుళంలో మత్స్యకారుల జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో చైతు మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు.

అతని సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాగచైతన్య సాధారణ మత్స్యకారుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ లుక్ కోసమే చైతూ పూర్తిగా మారిపోయాడు. రీసెంట్ గానే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

వీలైనంత తక్కువ సమయంలోనే ఈ సినిమాని పూర్తి చేయాలని చందు మొండేటి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెలలోనే ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రాబోతుందట. తాజా సమాచారం ప్రకారం తండేల్ గ్లింప్స్ ని రెడీ రెడీ చేసే పనిలో మేకర్స్ ఉన్నట్లు తెలిసింది. ఈ గ్లింప్స్ కోసం ఇటీవలే అల్లు స్టూడియోస్ లో ప్రత్యేకంగా ఓ సెట్ వేసి షూట్ చేశారట.

డిసెంబర్ 20 లోపు సోషల్ మీడియాలో గ్లింప్స్ ని రిలీజ్ చేయడంతోపాటు డిసెంబర్ 22న రిలీజ్ అవ్వబోతున్న సలార్ మూవీతో ఈ గ్లింప్స్ ని అటాచ్ చేయాలని టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే సలార్ థియేటర్స్ లోనే తండేల్ గ్లింప్స్ కూడా ప్రదర్శించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ గ్లిమ్స్ లో నాగచైతన్య మాస్ లుక్ తో పాటు డైలాగ్స్ కూడా ఉంటాయని వినికిడి. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

త్వరలోనే మూవీ టీం నుంచి గ్లింప్స్ వీడియోకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండడం, లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్య తో సాయి పల్లవి జోడి కడుతుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాని విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.