Begin typing your search above and press return to search.

సీనియ‌ర్స్-జూనియ‌ర్స్ అంతా ఒకే ప్రేమ్ లో!

సాధార‌ణంగా సినిమా ఈవెంట్ల‌లో త‌ప్ప ఇత‌ర సంద‌ర్భాల్లో అంతా ఒకే వేదిక‌ను పంచుకోరు

By:  Tupaki Desk   |   4 Aug 2023 11:09 AM GMT
సీనియ‌ర్స్-జూనియ‌ర్స్ అంతా ఒకే ప్రేమ్ లో!
X

లెజెండ్స్ అంతా ఒకే ప్రేమ్ లో చిక్క‌డం అన్న‌ది చాలా రేర్. అంతా ఒకేసారి ఒకేచోట చేరుకోవ‌డం చాలా అరుదుగా జ‌రుగుతుంది. సాధార‌ణంగా సినిమా ఈవెంట్ల‌లో త‌ప్ప ఇత‌ర సంద‌ర్భాల్లో అంతా ఒకే వేదిక‌ను పంచుకోరు. అయితే తాజాగా ఈ హ‌ద్దుల్ని చెరిపేసింద‌నిపిస్తుంది. కోలీవుడ్ దర్శ‌క దిగ్గ‌జాలు కొంద‌రు ఒకే ప్రేమ్ లో చిక్క‌డ‌మే అందుకు సాక్షం. ఇందులో దిగ్గజ దర్శకులు మణిరత్నం- శంకర్- గౌతమ్ వాసుదేవ్ మీనన్‌- మురుగ‌దాస్- లింగుస్వామి-లోకేష్ క‌న‌గ‌రాజ్-కార్తీక్ సుబ్బ‌రాజ్ ఒకే ఫ్రేమ్‌లో చిక్క‌డం విశేషం.

ఓ హోట‌ల్ లో వీరంతా స‌మావేశ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఆ సంద‌ర్భంగా అంతా ఒకే చోట చేరి ఇలా గ్రూప్ ఫోటో దిగారు. ఈ ఫోటో చూసి ఆయా ద‌ర్శ‌కుల అభిమానులు సంబ‌ర‌ప‌డిపోతున్నారు. సీనియ‌ర్ -జూనియ‌ర్ ద‌ర్శ‌కులు ఇలా క‌ల‌వ‌డంపై ర‌క‌ర‌కాల పోస్ట్ లు ప‌డుతున్నాయి. లొకేష్ క‌న‌గ‌రాజ్-కార్తీక్ సుబ్బ‌రాజ్ అతి త‌క్కువ కాలంలో సీనియ‌ర్ల స‌ర‌స‌న నిల‌బ‌డే స్థాయికి చేరుకున్నారు. వాళ్ల ప్ర‌తిభ మాత్ర‌మే వాళ్ల‌ని ఆస్థాయికి తీసుకెళ్లింది. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కులంతా ఎవ‌రి సినిమా షూటింగ్ ల్లో వాళ్లు బిజీగా ఉన్నారు.

మ‌ణిర‌త్నం- క‌మ‌ల్ హాస‌న్ హీరోగా తెర‌కెక్కించే సినిమా కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఇక శంక‌ర్ 'గేమ్ ఛేంజ‌ర్'..'ఇండియాన్ -2' షూటింగ్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. అలాగే లోకేష్ క‌న‌గ‌రాజ్ 'లియో' సినిమా ప‌నుల్లో త‌ల‌మున‌క‌లై ఉన్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. అక్టోబర్‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక క్రియేటివ్ మేక‌ర్ ఏ.ఆర్ ముర‌గ‌దాస్ 'ద‌ర్బార్' త‌ర్వాత ఇంత వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌లేదు. భారీ సినిమా చేయ‌డానికి క‌ర‌స‌ర‌త్తులు చేస్తున్నారు. స్టార్ హీరోలే టార్గెట్ గా ప్లానింగ్ ఉండ‌టంతో హీరోల డేట్లు ఇబ్బంది ఏర్ప‌డుతుంది.

అలాగే కార్తీక్ సుబ్బరాజ్ ' జిగర్తాండ డబుల్‌ఎక్స్‌' తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇక గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'దృవ న‌క్ష‌త్రం' సినిమా ప‌నుల్ని రీస్టార్ట్ చేసారు. విక్ర‌మ్ హీరోగా ప్రారంభ‌మైన సినిమాని వీలైనంత త్వ‌రంగా పూర్తిచేసి రిలీజ్ చేయాల‌ని ముందుకు క‌దులుతున్నారు. అలాగే యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు లింగుస్వామి 'వారియ‌ర్' త‌ర్వాత కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌లేదు. కోలీవుడ్ హీరోతోనే సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది.