Begin typing your search above and press return to search.

19 ఏళ్ళ కెరీర్.. ఇలాంటి డైరెక్టర్ ను చూడలేదు: తమన్నా

2022లో ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్ గా ఓదెల-2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 March 2024 7:12 AM GMT
19 ఏళ్ళ కెరీర్.. ఇలాంటి డైరెక్టర్ ను చూడలేదు: తమన్నా
X

మిల్కీ బ్యూటీ తమన్నా.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 19 ఏళ్లు అవుతున్నా.. ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అందం, అభినయంతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు.. బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టుల్లో నటిస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో సందడి చేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ఆడిపాడిన తమన్నా.. ఇప్పుడు మరో తెలుగు సినిమా చేస్తోంది.


2022లో ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్ గా ఓదెల-2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో హెబ్బా పటేల్ లీడ్ రోల్ పోషించింది. ఇప్పుడు సీక్వెల్ లో తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా మేకర్స్.. తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో తమన్నా లుక్ చూసి ఒక్కసారిగా అంతా షాకయ్యారు.

పెద్ద జట్టుతో ఢమరుకం చేతబట్టి శివశక్తిగా తమన్నా కనిపించింది. అయితే ఈ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ సంపత్ నంది ఆనందం వ్యక్తం చేశారు. ఆ సినిమాకు సంపత్ నంది క్రియేటర్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే ఆయన సహా నిర్మాతగా కూడా ఉన్నారు. ఇక కాదు తమన్నా లుక్ కోసం కాస్ట్యూమ్ డిజైనింగ్ నుంచి పోస్టర్ డిజైనింగ్ వరకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే ఆ పోస్ట్ కు తమన్నా రిప్లై ఇస్తూ సంపత్ నందిపై ప్రశంసలు కురిపించింది.

"ఏదైనా సినిమా తీయడం అనేది అందరూ కలిసి సమన్వయంగా పనిచేయడమని నేను ఎప్పుడూ గట్టిగా నమ్ముతాను. ఒక్కరి విజన్ తో మూవీ మొదలైనా టీమ్ అంతా కలిసి పనిచేస్తే మంచి అవుట్ పుట్ వస్తుంది. సంపత్ నంది దీన్ని బాగా అర్థం చేసుకున్నారు. నా 19 ఏళ్ల సినీ కెరీర్ లో సంపత్ నంది లాంటి పర్సన్ ను, ఇలా ప్రతి ఒక్కరి సహకారాన్ని ప్రశంసించడం ఎప్పుడూ చూడలేదు. అందరూ సమష్టిగా కలిసి పనిచేస్తే పోస్టర్ ఫైనల్ లుక్ వచ్చింది. అది అందరికీ నచ్చింది" అని తమన్నా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే తమన్నా.. ఇప్పటికే సంపత్ నంది డైరెక్షన్ లో రచ్చ, బెంగాల్ టైగర్, సీటిమార్ సినిమాల్లో నటించింది. మరోవైపు, ఓదెల-2కు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్‌ తో కలిసి సంపత్ నంది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, కేజీఎఫ్ ఫేమ్ వశిష్ట ఎన్ సింహా కూడా ఈ సీక్వెల్‌ లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో తమన్నా ఎలా అలరిస్తుందో చూడాలి.