Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అయిదు పదులు దాటిన ఎల్లోర శిల్పం

తాజాగా టబు నెట్‌ ఫ్లిక్స్ ఓటీటీ కోసం ఖుఫియా అనే సిరీస్ ని చేసింది. ఆ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఇలా అందాల ఆరబోత ఫోటో షూట్‌ తో రెచ్చి పోయింది.

By:  Tupaki Desk   |   10 Oct 2023 5:30 AM GMT
పిక్ టాక్ : అయిదు పదులు దాటిన ఎల్లోర శిల్పం
X

హైదరాబాద్ లో పుట్టి తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయి తక్కువ సమయంలోనే బాలీవుడ్ కు వెళ్లిన ముద్దుగుమ్మ టబు. నటి ఫరాహ్‌ చెల్లెలు అయిన ఈమె దివంగత హీరోయిన్‌ దివ్య భారతికి ప్రాణ స్నేహితురాలిగా టాక్. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు టబును కూలీ నెం.1 సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం జరిగింది.


మూడున్నర దశాబ్దాలుగా సినీ కెరీర్ ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మ టబు. తెలుగు లో కొన్నే సినిమాలు చేసినా కూడా ఎక్కువగా ఉత్తరాది ప్రేక్షకులను అలరించే విధంగా బాలీవుడ్ సినిమాలను చేసింది. హీరోయిన్ గా సుదీర్ఘమైన కెరీర్ ను కలిగి ఉన్న టబు ఇంకా కూడా హీరోయిన్ గానే వెలుగు వెలుగుతున్న విషయం తెల్సిందే.

అయిదు పదుల వయసు దాటినా కూడా టబు అందం ఏమాత్రం తగ్గ లేదు. అందుకే హీరోయిన్‌ గా ఇంకా కూడా అందాల ఆరబోత చేస్తూ కన్నుల విందు చేస్తోంది. బాబోయ్ ఏంటి ఈ అందాల రచ్చ అంటూ చాలా మంది అభిమానులు సోషల్‌ మీడియాలో టబు ఫోటోలు చూసిన ప్రతి సారి అనుకుంటూనే ఉంటారు.

తాజాగా టబు నెట్‌ ఫ్లిక్స్ ఓటీటీ కోసం ఖుఫియా అనే సిరీస్ ని చేసింది. ఆ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఇలా అందాల ఆరబోత ఫోటో షూట్‌ తో రెచ్చి పోయింది. నిజంగా ఈమె వయసు అయిదు పదులా అనిపించే విధంగా ఈ ఫోటోల్లో టబు కనిపిస్తుంది.

అయిదు పదుల వయసులోనూ మూడు పదుల వయసు ముద్దుగుమ్మ గా కనిపిస్తున్న టబు ఈ బ్లాక్ డ్రెస్ లో ఎల్లోర శిల్పం మాదిరిగా ఫోజ్ ఇస్తే నిజంగా ఎల్లోరా శిల్పమేనా అన్నట్లుగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు మరిన్ని బాలీవుడ్ సినిమాలు, సిరీస్ లతో పాటు సౌత్‌ లో ముఖ్యంగా తెలుగు సినిమాల్లో టబు నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.