Begin typing your search above and press return to search.

టికెట్‌ డబ్బులు వెనక్కి.. నిర్మాత షాకింగ్‌ ఛాలెంజ్‌

జాతి రత్నాలు కంటే తక్కువగా ఈ సినిమా నవ్వించింది అని ప్రేక్షకులు ఫీల్ అయితే కచ్చితంగా వారి టిక్కెట్ డబ్బులు తిరిగి ఇస్తాను అంటూ నిర్మాత షాకింగ్ ఛాలెంజ్ చేశాడు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 6:58 AM GMT
టికెట్‌ డబ్బులు వెనక్కి.. నిర్మాత షాకింగ్‌ ఛాలెంజ్‌
X

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. సూర్యదేవర నాగ వంశీ ఈ నిర్మాణ సంస్థను ముందుండి నడిపిస్తున్నాడు. త్రివిక్రమ్ తో పాటు పలువురు పెద్ద వారు ఈ బ్యానర్ వెనుక ఉన్నారు అనేది అందరికీ తెలిసిన రహస్యం.

ఆ విషయం పక్కన పెడితే మంచి కథలను ఎంపిక చేసుకుంటూ టెక్నీషియన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ నటీనటుల విషయంలో వారికి తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుంటూ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ చేస్తున్న సినిమాలు మంచి ఫలితాన్ని అందిస్తున్నాయి.


ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్ నుండి వచ్చిన చిన్న పెద్ద సినిమాల్లో సక్సెస్ శాతం చాలా ఎక్కువగా ఉంది. ఈ బ్యానర్ నుంచి మ్యాడ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతా కొత్త వారితో నాగ వంశీ సినిమాను నిర్మించాడు.

తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా జాతి రత్నాలుతో ఏమాత్రం తగ్గకుండా వినోదాన్ని పంచుతుందని పేర్కొన్నాడు. జాతి రత్నాలు కంటే తక్కువగా ఈ సినిమా నవ్వించింది అని ప్రేక్షకులు ఫీల్ అయితే కచ్చితంగా వారి టిక్కెట్ డబ్బులు తిరిగి ఇస్తాను అంటూ నిర్మాత షాకింగ్ ఛాలెంజ్ చేశాడు.

మ్యాడ్ సినిమాపై ఆయనకున్న నమ్మకం కి ఆ వ్యాఖ్యలు నిదర్శనం అనడంలో సందేహం లేదు. అంతా కొత్త వారితో ఆకట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన మ్యాడ్ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన కారణంగా మంచి ఓపెనింగ్ దక్కే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.