Begin typing your search above and press return to search.

యూట్యూబర్ తో వివాదం, చెక్ పెట్టిన సుప్రియ..!

దానిలో భాగంగానే, మీరు యూట్యూబర్ ని బెదిరించారా అని అడగగా, దానికి సుప్రియ సమాధానం చెప్పడం విశేషం. ఆ ప్రశ్నకు తానే సమాధానం చెబుతానని ముందుకు వచ్చారు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 2:55 PM GMT
యూట్యూబర్ తో వివాదం, చెక్ పెట్టిన సుప్రియ..!
X

అక్కినేని నాగార్జున మేన కోడలు సుప్రియ యార్లగడ్డ అందరికీ పరిచయమే. హీరోయిన్ గా ఒక సినిమా చేసి, తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే, ఈ మధ్యకాలంలోనే ఆమె నిర్మాతగా మారారు. ఇటీవల చాయ్ బిస్కెట్ తో కలిసి సుప్రియ బాయ్స్ హాస్టల్ అనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. నిజానికి ఈ మూవీ కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఇక్కడ కూడా రీమేక్ చేశారు. ఇక్కడికి తగ్గట్టు మార్పులు చేశారు.

తెలుగులోనూ ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఒక యూట్యూబర్ ఈ మూవీ కి రేటింగ్ సరిగా ఇవ్వలేదు. దీంతో, ఆయనను చాయ్ బిస్కెట్ నిర్మాత శరత్ బెదిరించారంటూ వార్తలు వచ్చాయి. సదరు యూట్యూబర్ ని శరత్ ఇష్టం వచ్చినట్లు తిట్టాడని, నీ ఛానెల్ తీసేస్తానంటూ కూడా బెదిరించారు అని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ వివాదానికి తాజాగా సుప్రియ సద్దుమణిగేలా చేశారు.

ఈ మూవీ బాయ్స్ హాస్టల్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఆ సక్సెస్ మీట్ లో శరత్ కూడా పాల్గొనడంతో ఆయనను మీడియా వాళ్లు ప్రశ్నలు కురిపించారు. దానిలో భాగంగానే, మీరు యూట్యూబర్ ని బెదిరించారా అని అడగగా, దానికి సుప్రియ సమాధానం చెప్పడం విశేషం. ఆ ప్రశ్నకు తానే సమాధానం చెబుతానని ముందుకు వచ్చారు.

మీడియా ప్రజలకు, నిర్మాతలకు మాధ్యమం లాంటివారన్నారు. తాము మంచి సినిమా చేసినా, దానిని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లేది మీడియానేనని ఆమె అన్నారు. ఇక్కడ బెదిరింపులకు తావు లేదని, ఇంక, మీడియా వాళ్లే తమను బెదిరించిన సందర్భాలు ఉన్నాయని చెప్పడం విశేషం. ఇక్కడితో, ఆ యూట్యూబర్ ని బెదిరించిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె చెప్పకనే చెప్పారు. ఈ వివాదాన్ని పెద్దది కాకుండా, ఆమె చాలా చక్కగా పరిస్థితిని చక్కపెట్టారు అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

ఇక, సినిమా విషయానికి వస్తే, కన్నడలో హిట్ అయిన సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. రక్షిత్‌ శెట్టి సమర్పించిన ఈ సినిమాకు నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. ఈయనకిది తొలి సినిమా అయినప్పటికీ, అందరినీ మెప్పించేలా తీశారు. దాదాపు 500 మందికి పైగా కొత్తవారితో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో యాంకర్ రష్మి, తరుణ్ భాస్కర్, రిషభ్ శెట్టి లాంటివారు అతిథి పాత్రలో కనిపించారు.