Begin typing your search above and press return to search.

బాంబే నిర్మాతలు మైత్రి వాళ్ళను చూసి నేర్చుకోవాలి!

ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సన్నీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

By:  Tupaki Desk   |   24 March 2025 4:52 PM IST
బాంబే నిర్మాతలు మైత్రి వాళ్ళను చూసి నేర్చుకోవాలి!
X

బాలీవుడ్ సీనియర్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నెక్స్ట్ టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జాట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి టాప్ తెలుగు నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు.

ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సన్నీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “ఒకసారి స్క్రిప్ట్, కాస్టింగ్, డైరెక్టర్ అన్నీ లాక్ అయితే, డైరెక్టర్‌పై పూర్తి నమ్మకంతో సినిమాను ఫ్లోలో జరగనివ్వాలి. ‘జాట్’ ప్రాజెక్ట్‌లో మైత్రి, పీపుల్ మీడియా నా మీద, మా టీమ్ మీద పూర్తిగా ట్రస్ట్ పెట్టి పని చేయించడం నాకు బాగా నచ్చింది. వారిని చూసి బాంబే నిర్మాతలు చాలా నేర్చుకోవాలి” అంటూ సన్నీ వ్యాఖ్యానించారు.

ఈ మాటలతో సన్నీ బాంబే నిర్మాతలపై అసంతృప్తిని చాటారా అనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్న లాహోర్ 1947 చిత్రం విషయంలో ఏర్పడిన ఆలస్యం ఈ వ్యాఖ్యలకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందుతోన్న ఆ చిత్రం ఫిబ్రవరిలోనే షూటింగ్ కంప్లీట్ అయ్యినా, ఇప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్‌లోనే ఉంది.

జనవరి రిలీజ్ నుంచి జూన్‌కు వాయిదా వేసుకోవడం, సన్నీ పాత్ర విషయాల్లో మార్పులు రావడం లాంటి సమస్యలతో సినిమాపై ఆయనకు అసహనం వచ్చినట్లు సమాచారం. ఇక ‘జాట్’ సినిమాలో సన్నీ డియోల్ పవర్‌ఫుల్ యాక్షన్ హీరోగా కనిపించబోతుండగా, విలన్‌గా రణ్‌దీప్ హుడా పాత్ర హైలైట్ కానుందని ట్రైలర్ ద్వారా అర్థమైంది.

దీనికి తమన్ సంగీతం, మలినేని మాస్ టచ్ కలిసొస్తే, ఇది సన్నీకి మళ్లీ హిట్ పునాదులు వేసే సినిమాగా నిలుస్తుందన్న ఆశాభావం ఉంది. నిర్మాతలపై పూర్తిగా నమ్మకంతో పని చేసే సందర్భాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడంలోనూ అదే స్థిర సంకేతం కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సన్నీ – ఆమిర్ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో చూడాలి. కానీ జాట్ ప్రాజెక్ట్‌లో మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి తెలుగు సంస్థలు చూపించిన ప్రొఫెషనలిజాన్ని బహిరంగంగా పొగడటం తెలుగు సినిమా ఇండస్ట్రీకే గర్వకారణంగా మారింది.