సన్నీ డియోల్ 'జాట్'.. మైత్రీ సంస్ధ కీలక నిర్ణయం
బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్ లీడ్ రోల్ లో టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని జాట్ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 19 April 2025 5:50 AMబాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్ లీడ్ రోల్ లో టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని జాట్ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. తెలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మించిన ఆ సినిమాలో జగపతి బాబు, రమ్యకృష్ణ, రణదీప్ హుడా, రెజీనా తదితరులు కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు.
ఏప్రిల్ 10వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన జాక్.. ఫస్ట్ వీక్ లో రూ.84 కోట్లకుపైగా వసూళ్లు చేసింది. ఇప్పుడు మరిన్ని వసూళ్లు రాబడుతోంది. అయితే సినిమాలో మతపరమైన అంశానికి సంబంధించిన ఓ సీన్ పై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మేకర్స్ రెస్పాండ్ అయ్యారు.
సోషల్ మీడియాలో స్పెషల్ నోట్ కూడా రిలీజ్ చేశారు. జాట్ మూవీలోని ఓ సన్నివేశంపై నెగెటివ్ రియాక్షన్ వచ్చిందని, ఆ సీన్ విషయంలో తాము బాధపడుతున్నామని తెలిపారు. దాన్ని ఇప్పుడు సినిమా నుంచి తొలగించామని, ఎవరి మనోభావాలు కూడా కించపరిచే ఉద్దేశం తమకు లేదని క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో క్షమాపణలు కూడా చెప్పారు.
అయితే టాలీవుడ్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. బాలీవుడ్ లో జాట్ సూపర్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా జాట్ కు సీక్వెల్ ఉంటుందని మూవీ టీమ్ ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే రెండో భాగం తీయనున్నామని తెలిపింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత జాట్ విశ్రాంతి తీసుకోవాలనుకోవడం లేదని పేర్కొంది.
ఈసారి మరో పెద్ద మిషన్ తో.. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో జాట్ ఆడియన్స్ ముందుకువస్తారని పోస్టర్ కూడా షేర్ చేసింది. అయితే జాట్ సీక్వెల్ ప్రకటించామని, కానీ దానికి సమయం పడుతుందని గోపీచంద్ మలినేని రీసెంట్ గా చెప్పారు. బాలకృష్ణతో మరో సినిమా చేయబోతున్నానని, అది అయ్యాక జాట్ చేస్తానని చెప్పారు.
అయితే జాట్ స్క్రిప్టు సమయంలోనే పార్ట్ 2 ఐడియా కూడా వచ్చిందని, రెండో భాగం.. తొలి భాగాన్ని మించి ఉంటుందని ప్రేక్షకులకు మాటిస్తున్నా అంటూ అంచనాలు పెంచారు. సీక్వెల్ లో సన్నీ డియోల్ రోల్ కుటుంబ నేపథ్యాన్ని చూపించనున్నామని తెలిపారు. సీక్వెల్ లో జాట్ కంటే ఎక్కువ యాక్షన్, ఎమోషన్, కామెడీ ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. మరి సీక్వెల్ ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.