Begin typing your search above and press return to search.

బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రాంచైజీ నుంచి మ‌రోటి!

కానీ తాజాగా ఈ చిత్రానికి `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ -3`ని కూడా తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

By:  Tupaki Desk   |   2 April 2024 7:49 AM GMT
బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రాంచైజీ నుంచి మ‌రోటి!
X

బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్` గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తొలి భాగాన్ని క‌ర‌ణ్ జోహార్ తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంటే రెండ‌వ భాగాన్ని పులిత్ మ‌ల్హోత్రా తెర‌కెక్కించి అదే స‌క్సెస్ ని కంటున్యూ చేసారు. ఈ రెండు విజ‌యాల‌తో `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్` అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా మారిపోయింది. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ -2` రిలీజ్ అయి ఐదేళ్లు అవుతుంది. అప్ప‌టి నుంచి మూడ‌వ భాగం ఎప్పుడు? అంటూ అభిమానులు అడుగుతున్నా? ఇంత‌కాలం స్కిప్ కొట్టారు.

కానీ తాజాగా ఈ చిత్రానికి `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ -3`ని కూడా తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మూడ‌వ భాగం బాధ్య‌త‌లు క‌ర‌ణ్ జోహ‌ర్ తీసుకోవ‌డం విశేషం. అయితే ఆయ‌న కేవ‌లం నిర్మాత‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ద‌ర్శ‌క‌త్వం బాధ్య‌త‌లు రీమా యామ‌కి అప్ప‌గించారు. `ఆమె పేరు మాదిరిగానే ఆమెది కూడా ఓ వితం ప్ర‌పంచం. అందులోకి నేను ప్ర‌వేశిస్తే అది మ‌రింత అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడీ సిరీస్ ని రూపొందిచే బాధ్య‌త ఆమెది మాత్ర‌మే. అందులో నేను ఎలాంటి ఫింగ‌రింగ్ చేయ‌ను` అని అన్నారు.

అయితే ఇందులో న‌టీన‌టులు ఎవ‌రు? అన్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు. ఆ వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ మ‌ధ్య కాలంలో మ‌ళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్కినట్లే ఎక్కారు క‌ర‌ణ్. ఏ వ‌త‌న్ మేరే వ‌త‌న్ సినిమాని ఆయ‌నే డైరెక్ట్ చేసాడు. గ‌త నెల‌లోనే రిలీజ్ అయింది. దీంతో ఇక‌పై కంటున్యూగా సినిమాలు డైరెక్ట్ చేస్తార‌ని అంతా భావించారు. కానీ ఆయ‌న నిర్మాణానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు.

మునుప‌టిలా క్రియేటివ్ గా వెళ్ల‌డం లేదు. ఆట్యాలెంట్ అంతా బుల్లి తెర‌పై వివిధ షోల రూపంలో చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో ఎక్కువ సినిమాలు నిర్మించే ప‌నిలో బిజీగా ఉన్నారు. అలాగే ఇత‌ర సంస్థ‌ల భాగ‌స్వామ్యంలోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. కొంత కాలంగా క‌ర‌ణ్ ఆ వ్యాప‌కాల‌తోనే బిజీగా ఉంటున్నారు.