ఎస్ ఎస్ ఎంబీ 29 అంతా గప్ చుప్!
చిత్రీకరణ జరిగినన్ని రోజులు ఏదో రూపంలో అప్ డేట్స్ అందుతుండేవి. ముఖ్యంగా ఒడిశా షెడ్యూల్ ఉన్నంత కాలం లీకులు నెట్టింట వైరల్ గా మారేవి. ఇంటర్నెట్ అంతా కోలాహాలంగా ఉండేది.
By: Tupaki Desk | 13 April 2025 10:30 PMసూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో మొదలైన షూటింగ్ ఒడిశాతో కొన్ని షెడ్యూల్స్ ను పూర్తి చేసింది. చిత్రీకరణ జరిగినన్ని రోజులు ఏదో రూపంలో అప్ డేట్స్ అందుతుండేవి. ముఖ్యంగా ఒడిశా షెడ్యూల్ ఉన్నంత కాలం లీకులు నెట్టింట వైరల్ గా మారేవి. ఇంటర్నెట్ అంతా కోలాహాలంగా ఉండేది.
కానీ ఒడిశా షెడ్యూల్ పూర్తయిన అనంతరం ఒక్కసారిగా అప్ డేట్ కరువైంది. ఫారిన్ లో కొత్త షెడ్యూల్ మొదలైందా? లేదా? అన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు. ఈ షెడ్యూల్ కు ముందు రాజమౌళి ప్రెస్ మీట్ పెడతారనే ప్రచారం జరిగింది కానీ ఇంతవరకూ అది జరగలేదు. దీంతో ఒక్కసారిగా ఎస్ ఎస్ ఎంబీ 29 గప్ చుప్ గా మారింది. మహేష్ అండ్ కో ఎక్కడుంది? రాజమౌళి సైలెంట్ గా షూట్ మధ్యలో మళ్లీ వర్క్ షాప్ లు ఏవైనా నిర్వహిస్తున్నారా? వంటి సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
ఫారిన్ షెడ్యూల్ చాలా పెద్దది. దట్టమైన అడవుల్లో షూటింగ్ అన్నది అతి పెద్ద టాస్క్. మహేష్ పై చాలా రిస్కీ షాట్స్ తీయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మహేష్ విదేశాల్లో కొంత ట్రైనింగ్ కూడా పూర్తి చేసాడు. మరి ఇలాంటి సన్నివేశాలకు సంబంధించి వర్క్ షాప్స్ ఏమైనా నిర్వహిస్తున్నారా? అన్న డౌట్ రెయిజ్ అవుతుంది. ప్రియాకం చోప్రా మాత్రం ఒడిశా షెడ్యూల్ అనంతరం న్యూయార్క్ వెళ్లిపోయింది.
విదేశీ షెడ్యూల్ లో ఆమె పై చిత్రీకరణ ఉంటే యధావిధిగా జాయిన్ అవుతుంది. సినిమాలో గ్లోబల్ బ్యూటీ పాత్ర కూడా అత్యంత కీలకమైంది. మహేష్ రోల్ కి ధీటుగా ఆమె పాత్ర కూడా ఉంటుందని యూనిట్ వర్గాల నుంచి లీకులందుతున్నాయి. మరి పీసీ కూడా మహేష్ లా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుందా? అన్నది సస్పెన్స్.