Begin typing your search above and press return to search.

ట్రిపుల్‌ ధమాకా.. లక్ అంటే ఈ యంగ్‌ హీరోదే!

సినిమా ఇండస్ట్రీలోని యంగ్‌ హీరోలకు పలానా దర్శకుడి దర్శకత్వంలో నటించాలని, పలానా బ్యానర్‌ లో సినిమా చేయాలనే కోరిక ఉంటుంది

By:  Tupaki Desk   |   3 March 2024 8:07 AM GMT
ట్రిపుల్‌ ధమాకా.. లక్ అంటే ఈ యంగ్‌ హీరోదే!
X

సినిమా ఇండస్ట్రీలోని యంగ్‌ హీరోలకు పలానా దర్శకుడి దర్శకత్వంలో నటించాలని, పలానా బ్యానర్‌ లో సినిమా చేయాలనే కోరిక ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ నిర్మాణ సంస్థలు ఏంటి అంటే ఠక్కున మొదట వినిపించే మూడు పేర్లు యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ మరియు పీపుల్స్ మీడియా.

ఈ మూడు బ్యానర్‌ లలో యంగ్‌ హీరోలు సినిమాలు చేయాలని ఆశ పడుతూ ఉంటారు. అలాంటిది ఒకే ఒక్క యంగ్‌ హీరో ఈ మూడు బ్యానర్స్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఆ మూడు సినిమాలు రాబోయే ఏడాది కాలంలో వరుస పెట్టి మరీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఆ హీరో మరెవరో కాదు.. యంగ్‌ అండ్ ట్యాలెంటెడ్‌ హీరో శ్రీ విష్ణు. సామజవరగమణ సినిమా హిట్‌ తో జోష్ మీదున్న శ్రీ విష్ణు వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు. అదృష్టం కొద్ది ఆయన కమిట్‌ అయిన మూడు సినిమాలు కూడా మూడు ప్రముఖ నిర్మాణ సంస్థ లో నిర్మాణం జరుగబోతున్నాయి.

ఇప్పటికే శ్రీవిష్ణు ఓమ్‌ భీమ్‌ బుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. టీజర్ తో ఆ సినిమా పై అంచనాలు పెరిగాయి. యూవీ క్రియేషన్స్‌ వారు ఈ విభిన్నమైన సినిమాను శ్రీ విష్ణు తో నిర్మించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

ఇక తాజాగా శ్రీ విష్ణు పుట్టిన రోజు సందర్భంగా స్వాగ్‌ అనే విభిన్నమైన టైటిల్‌ తో ఒక సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో ఆ సినిమా రూపొందుతోంది. ఇక గీతా ఆర్ట్స్ లో కూడా శ్రీ విష్ణు సినిమా ఉండబోతుందని అధికారిక ప్రకటన వచ్చింది.

ప్రముఖ బ్యానర్‌ లలో సినిమాలు చేసే అవకాశం దక్కడంతో పాటు శ్రీ విష్ణు కు మూడు కూడా మూడు విభిన్నమైన కాన్సెప్ట్‌ సినిమాలు అవ్వడంతో ఆయన అభిమానులు మరియు సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు కచ్చితంగా శ్రీ విష్ణు కెరీర్‌ లో నిలిచి పోయే సినిమాలు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.