Begin typing your search above and press return to search.

పారితోషికంలో సౌత్ టాప్ 10 హీరోయిన్స్

ఇండ‌స్ట్రీలో ఎవ‌ర్ గ్రీన్ హీరోయిన్ గా ఒక్కో సినిమాకు 5-10 కోట్ల మ‌ధ్య‌లో పారితోషికం డిమాండ్ చేస్తోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   14 May 2024 3:00 AM GMT
పారితోషికంలో సౌత్ టాప్ 10 హీరోయిన్స్
X

క్రేజ్ ను బ‌ట్టి.. లుక్కు ల‌క్కుతో పాటు ప్ర‌తిభ‌ను బ‌ట్టి కూడా ఈరోజుల్లో క‌థానాయిక‌ల పారితోషికాలు డిసైడ్ అవుతున్నాయి. అలా చూస్తే పారితోషికంలో సౌత్ లో టాప్ 10 క‌థానాయిక‌ల పారితోషికాలు షాకిస్తున్నాయి. చ‌క్క‌న‌మ్మ‌లు చుక్క‌లు చూపిస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు. ఇటీవ‌ల సెల‌క్టివ్ గా స్క్రిప్టులు ఎంచుకుంటున్న స్టార్ హీరోయిన్ త్రిష ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభ‌ర‌లో న‌టిస్తోంది. త్రిష ఒక్కో సినిమాకి 10 కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటోంద‌ని స‌మాచారం. క‌మ‌ల్ హాస‌న్- మ‌ణిర‌త్నం థ‌గ్ లైఫ్ కోసం 12 కోట్లు డిమాండ్ చేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి. త‌లైవిగా త‌మిళ ప‌రిశ్ర‌మ‌ను ఏల్తున్న న‌య‌న‌తార ఇటీవ‌ల జవాన్ హిందీ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని 1000 కోట్ల క్ల‌బ్ నాయిక అయింది. ఇండ‌స్ట్రీలో ఎవ‌ర్ గ్రీన్ హీరోయిన్ గా ఒక్కో సినిమాకు 5-10 కోట్ల మ‌ధ్య‌లో పారితోషికం డిమాండ్ చేస్తోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

కేజీఎఫ్ - కేజీఎఫ్ 2లో న‌టించింది శ్రీ‌నిధి శెట్టి. పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ల క‌థానాయిక‌గా త‌న‌కంటూ ఒక రేంజ్ ఉంది. అయితే శ్రీ‌నిధి సెల‌క్టివ్ గా స్క్రిప్టుల‌ను ఎంచుకుంటోంది. చివ‌రిగా తమిళ చిత్రం కోబ్రాలో కనిపించిన ఈ బ్యూటీ తెలుగు చిత్రం `తెలుసు కదా`లో సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నాతో కలిసి కనిపించనుంది. ఈ సినిమా స్థాయిని బ‌ట్టి పారితోషికం డిమాండ్ చేస్తోంద‌ట‌. తాత్కాలికంగా కిచ్చా 47 పేరుతో కిచ్చా సుదీప్ న‌టిస్తున్న తదుప‌రి చిత్రంలోను శ్రీ‌నిధి న‌టిస్తోంది. శ్రీ‌నిధి 5 కోట్ల రేంజులో డిమాండ్ చేస్తోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

పూజా హెగ్డే అంటే పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. 2012లో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నాయిక‌. ప్రతి చిత్రానికి రూ. 5 కోట్లు సంపాదిస్తుంది. చివరిగా 2023లో స‌ల్మాన్ యాక్షన్ కామెడీ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్ లో క‌నిపించింది. ప్రస్తుతం షాహిద్ కపూర్‌తో దేవా లో న‌టిస్తోంది. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్. ప్రఖ్యాత మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

సౌత్ లో విపరీతమైన ఫాలోయింగ్‌ను అస్వాధించిన అనుష్క ఇటీవ‌ల ప‌రిమితంగా సినిమాల్లో న‌టిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో అద్భుత న‌ట‌ ప్రదర్శనలతో అభిమానులను నిరంతరం అలరించిన ఈ మేటి బ్యూటీ ఒక్కో సినిమాకు సుమారుగా రూ. 4-7 కోట్ల వరకు సంపాదిస్తుంది. అనుష్క శెట్టి చివరిగా తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో కనిపించింది. ప్రస్తుతం మలయాళంలో కథనార్ - ది వైల్డ్ సోర్సెరర్ అనే సినిమాలో న‌టిస్తోంది. ఇందులో జయసూర్య, ప్రభుదేవా, వినీత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. రోజిన్ థామస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో రష్మిక మందన్న ఒకరు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ యంగ్ బ్యూటీ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంది. నేష‌న‌ల్ క్ర‌ష్ గా భారీగా అభిమానులను కలిగి ఉంది. 2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో అరంగేట్రం చేసిన ర‌ష్మిక‌ ఆ తర్వాత అనేక తమిళ, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించింది. పుష్ప‌లో శ్రీ‌వ‌ల్లిగా అద్భుతంగా న‌టించి మెప్పించింది. ర‌ష్మిక‌ ఒక్కో సినిమాకు సుమారుగా రూ. 5 కోట్లు వసూలు చేస్తుంది. అంతేకాకుండా బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్ కోసం 4 కోట్లు వసూలు చేసినట్లు క‌థ‌నాలొచ్చాయి. ప్రస్తుతం సుకుమార్ - అల్లు అర్జున్ కాంబో మూవీ పుష్ప సీక్వెల్‌లో న‌టిస్తోంది. ఈ ఏడాది స్వాతంత్య్ర‌ దినోత్సవం రోజున ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇంకా ధనుష్- నాగార్జునలతో శేఖర్ కమ్ముల చిత్రం కుబేరలో ర‌ష్మిక న‌టిస్తోంది.

2010లో అరంగేట్రం చేసిన సమంత రూత్ ప్రభు ఏ మాయ చేసావే, ఈగ, మెర్సల్, సూపర్ డీలక్స్, యు టర్న్ స‌హా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలలో నటించింది. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ .. పుష్ప ఊ అంటావా ప్ర‌త్యేక గీతం స‌మంత రేంజును అమాంతం పెంచాయి. భారతీయ ప్రేక్షకుల అభిమాన నటీమణులలో ఒకరిగా వెలుగుతోంది. తమిళం, తెలుగు పరిశ్రమలలో తనదైన ముద్ర వేసిన స‌మంత‌ తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకుంది. ఒక్కో సినిమాకు దాదాపు 3 - 5 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటోంది. ఆరోగ్య సమస్యల కారణంగా పని నుండి విశ్రాంతి తీసుకున్న సమంత `టేక్ 20` పేరుతో తన సొంత ఆరోగ్య పోడ్‌కాస్ట్‌ను ప్రారంభించినట్లు ఇటీవల ప్రకటించింది. తదుపరి వెబ్ సిరీస్ `సిటాడెల్: హనీ బన్నీ`లో కనిపించనుంది. ఇందులో వరుణ్ ధావన్ క‌థానాయ‌కుడిగా నటించారు. దర్శక ద్వయం రాజ్ & Dk ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సామ్ తెలుగులో `బంగారం` సినిమాని కూడా ప్రకటించింది. ఈ సినిమాకి త‌నే నిర్మాత‌.

2005లో ఆరంగేట్రం చేసిన తమన్నా గత 19 సంవత్సరాలుగా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించింది. రాజ‌మౌళి బాహుబ‌లిలో అవంతిక‌గా న‌టించి మెప్పించింది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో న‌టించింది. ఒక్కో సినిమాకు 4-5 కోట్ల రేంజులో పారితోషికాలు అందుకుంటోంద‌ని టాక్. అందాల ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌ల హిందీలో న‌టిస్తోంది. ఒక్కో సినిమాకు 2-3 కోట్ల రేంజులో అందుకుంటోంది. ఇత‌ర భామ‌ల్లో 2 కోట్ల రేంజులో పారితోషికాలు అందుకుంటున్న వారిలో శ్రీ‌లీల పేరు ఇటీవ‌ల వినిపిస్తోంది.

క‌థానాయిక‌ల పారితోషికాలు:

త్రిష‌- 10 కోట్లు

న‌య‌న‌తార - 5-10 కోట్లు

శ్రీ‌నిధి శెట్టి- 7 కోట్లు

పూజా హెగ్డే - 5 కోట్లు

అనుష్క శెట్టి 4-7 కోట్లు

ర‌ష్మిక మంద‌న‌- 5 కోట్లు

స‌మంత 3-5 కోట్ల మ‌ధ్య‌లో

త‌మ‌న్నా- 5 కోట్లు

ర‌కుల్ ప్రీత్ సింగ్ 2-3 కోట్లు