Begin typing your search above and press return to search.

మన హీరోయిన్ల మనసంతా అక్కడే..

సౌత్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి భారీ గుర్తింపు తెచ్చుకున్న కొందరు హీరోయిన్లు ఇప్పుడు నార్త్ పై కన్నేశారు.

By:  Tupaki Desk   |   14 Dec 2023 3:08 PM GMT
మన హీరోయిన్ల మనసంతా అక్కడే..
X

సౌత్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి భారీ గుర్తింపు తెచ్చుకున్న కొందరు హీరోయిన్లు ఇప్పుడు నార్త్ పై కన్నేశారు. వాళ్లలో నయనతార, రష్మిక మందన, పూజా హెగ్డే, సాయి పల్లవి, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్స్ ఇన్నేళ్లు సౌత్ లో సత్తా చాటిన ఈ హీరోయిన్స్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే సౌత్ లో లేడీస్ సూపర్ స్టార్ గా పేరొందిన నయనతార షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. నయన్ తర్వాత రష్మిక మందన్న కూడా బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ఎట్టకేలకు యానిమల్ మూవీతో రష్మిక కూడా బాలీవుడ్ లో భారీ సక్సెస్ అందుకుంది. ఇక వీరి బాటలోనే కీర్తి సురేష్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ తో పాటు బాలీవుడ్ లో మరో సినిమాకి కమిట్ అయింది కీర్తి సురేష్.

ఈ రెండు కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరి కీర్తి సురేష్ అక్కడ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. కీర్తి సురేష్ తర్వాత సౌత్ న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో కలిసి రామాయణం ప్రాజెక్టులో నటిస్తుంది. వచ్చే ఏడాది మార్చ్ నుంచి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళింది. ఇక సౌత్ ఇండస్ట్రీని ఏదైనా స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే కి ప్రజెంట్ టాలీవుడ్ లో అవకాశాలు లేవు.

దీంతో ఆమె ఎక్కువగా బాలీవుడ్ పైనే ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన అవి పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి. ప్రస్తుతం షాహిద్ కపూర్ సరసన దేవా అనే మూవీలో నటిస్తోంది. మరి సౌత్ లో సక్సెస్ అందుకున్న ఈ హీరోయిన్స్ అందరూ నార్త్ లో కూడా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి. కాగా నయనతార, రష్మిక, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తూనే మరోవైపు సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు.

నయనతార ఇప్పటికే తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. రష్మిక మందన పుష్ప 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి కూడా తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. రీసెంట్గా టాలీవుడ్ లో రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మేకర్స్ నుండి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.