Begin typing your search above and press return to search.

దర్శకుడికి సౌందర్య క్షమాపణలు చెప్పిన సందర్భం...!

ఆ వివరాల్లోకి వెళ్తే... రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాతో సౌందర్య ను ఎస్వీ కృష్ణా రెడ్డి పరిచయం చేశాడు.

By:  Tupaki Desk   |   7 March 2024 1:30 AM GMT
దర్శకుడికి సౌందర్య క్షమాపణలు చెప్పిన సందర్భం...!
X

సౌందర్య చనిపోయి 20 ఏళ్లు అవుతున్నా కూడా ఆమె జ్ఞాపకాల్లోనే అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు. ఈతరం ప్రేక్షకులకు సౌందర్య గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1980 కిడ్స్‌ కి సౌందర్య కలల రాణి. స్టార్‌ హీరోలందరికి కూడా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా సౌందర్య నిలిచింది. అలాంటి సౌందర్య ఒక దర్శకుడికి క్షమాపణలు చెప్పింది.

ఆ వివరాల్లోకి వెళ్తే... రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాతో సౌందర్య ను ఎస్వీ కృష్ణా రెడ్డి పరిచయం చేశాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇద్దరి కాంబోలో మాయలోడు, నెంబర్‌.1, టాప్‌ హీరో సినిమాలు కూడా వచ్చాయి. సూపర్‌ హిట్‌ చిత్రాలతో జోరు మీదున్న ఎస్వీ కృష్ణరెడ్డి అలీ తో 'యమలీల' సినిమాకు రెడీ అయ్యాడు.

ఆ సమయంలో చాలా మంది యమలీల సినిమాను అలీతో తీయడంను వ్యతిరేకించారు. అయినా కూడా కృష్ణారెడ్డి తాను అనుకున్నది చేసేందుకు సిద్ధం అయ్యాడు. తనకు లక్కీ హీరోయిన్‌ గా నిలిచిన సౌందర్య ను యమలీల సినిమా కోసం హీరోయిన్‌ గా అనుకున్నాడు.

కచ్చితంగా సౌందర్య ఒప్పుకుంటుందని నమ్మకంగా ఉన్న కృష్ణ రెడ్డికి షాక్‌. ప్రస్తుతం స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తున్న నేను అలీతో సినిమా చేస్తే కెరీర్‌ పై ప్రభావం పడుతుందేమో అనే ఉద్దేశ్యంతో యమలీల సినిమాను చేసేందుకు తిరస్కరిస్తున్నట్లు చెప్పిందట.

యమలీల సినిమా కు సౌందర్య నో చెప్పడంతో ఇంద్రజ ను ఎస్వీ కృష్ణారెడ్డి తీసుకు వచ్చాడు. అలీతో నటించేందుకు నో అయితే చెప్పింది కానీ సౌందర్య చాలా బాధపడిందట. యమలీల సినిమా ను చేయనందుకు ఎస్వీ కృష్ణారెడ్డికి క్షమాపణలు చెప్పడం తో పాటు ఆయన దర్శకత్వంలో వచ్చిన మాయలోడు సినిమాలో బాబు మోహన్‌ కు జోడీగా ప్రత్యేక పాటలో నటించి తన తప్పును దిద్దుకుంది. అప్పట్లో హీరోయిన్స్ అంతగా దర్శకులకు గౌరవం ను ఇచ్చేవారు. ఇప్పటి వారు ఎంత వరకు గౌరవం ఇస్తారు అనేది అందరికి తెల్సిందే.