రాజమౌళి సినిమాలను ఫుల్గా వాడేస్తున్న బాలీవుడ్..!
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఇండస్ట్రీలో అడుగు పెట్టి పాతిక సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు 12. ఈ సినిమాల్లో అన్నీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
By: Tupaki Desk | 14 Jun 2025 11:30 AMటాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఇండస్ట్రీలో అడుగు పెట్టి పాతిక సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు 12. ఈ సినిమాల్లో అన్నీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. జక్కన్న సినిమాల్లో దాదాపు అన్నీ కూడా హిందీలోనూ విడుదల అయ్యాయి. కొన్ని సినిమాలు అక్కడ డబ్ కాగా, కొన్ని సినిమాలు రీమేక్ అయ్యాయి. ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన చత్రపతి ఇటీవలే బాలీవుడ్లో రీమేక్ అయిన విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు, మర్యాద రామన్న సినిమాలు కూడా రీమేక్ అయ్యాయి. మగధీర సైతం హిందీలో రీమేక్ కి సంబంధించిన ప్రచారం జరిగింది. కానీ ఆ స్థాయిలో రీమేక్ చేయడం సాధ్యం కాదని, ఆ మ్యాజిక్ను రీ క్రియేట్ చేయడం సాధ్యం కాదని భావించి ఆ ఆలోచన విరమించుకున్నారు.
మర్యాద రామన్న సినిమాను హిందీలో అజయ్ దేవగన్ హీరోగా సన్నాఫ్ సర్దార్ టైటిల్తో రీమేక్ అయిన విషయం తెల్సిందే. 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సన్నాఫ్ సర్దార్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అజయ్ దేవగన్ కి ఆ సినిమా సూపర్ హిట్గా నిలవడం మాత్రమే కాకుండా కెరీర్లో ఒక మంచి బ్రేక్ థ్రూ లభించినట్లు అయింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆ సినిమాకు ఇన్నాళ్లకు రీమేక్ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఒరిజినల్ మర్యాద రామన్న సినిమాకు రాజమౌళి రీమేక్ చేసే ఆలోచన చేలేదు. కానీ రీమేక్ సన్నాఫ్ సర్ధార్కి మాత్రం రీమేక్ ప్లాన్ చేశారు, ఇప్పటికే పట్టాలెక్కించారు.
సన్నాఫ్ సర్దార్ సినిమాకు అశ్విని ధీర్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం సీక్వెల్గా రూపొందుతున్న సన్నాఫ్ సర్దార్ 2 సినిమాకు గాను విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అజయ్ దేవగన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నాయి. ఈ సమయంలో ఆయన హీరోగా సినిమాలు చేయక పోవడం మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో సన్నాఫ్ సర్ధార్ 2 సినిమాను మొదలు పెట్టిన నేపథ్యంలో ఎట్టకేలకు మరో విజయాన్ని అజయ్ దేవగన్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అజయ్ దేవగన్ ఈ మధ్య కాలంలో యాక్షన్ సినిమాలకు ఎక్కువగా చేయడంతో అభిమానులు ఆయన నుంచి వినోదాత్మక సినిమాను ఆశిస్తున్నారు.
చాలా కాలం తర్వాత అజయ్ దేవగన్ నుంచి ఒక పూర్తి స్థాయి ఎంటర్టైనర్ రాబోతుంది. సన్నాఫ్ సర్దార్ సినిమా స్థాయిలో వినోదాన్ని సీక్వెల్లో అందించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మర్యాద రామన్న కథకు స్వల్ప మార్పులు చేసిన హిందీ మేకర్స్ అక్కడి నేటివిటీకి తగ్గట్లుగా స్క్రీన్ప్లేను డిజైన్ చేశారు. ఇప్పుడు అదే కథకు కొనసాగింపుగా సీక్వెల్ సినిమా కథను రెడీ చేశారని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, కుబ్రా సైట్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.
జులై 25, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మేకర్స్తో పాటు ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. రాజమౌళి సినిమా సీక్వెల్ కావడంతో బాలీవుడ్ మేకర్స్లో ఆసక్తి నెలకొంది. రాజమౌళి విక్రమార్కుడు రీమేక్ అయిన రౌడీ రాథోడ్ కి సైతం సీక్వెల్ రూపొందించే పనిలో సంజయ్ లీలా భన్సాలీ ఉన్నారని గత ఏడాది చివర్లో వార్తలు వచ్చాయి. అది ఎంత వరకు వచ్చింది అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి రాజమౌళి పాత సినిమాలను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఫుల్గా వాడేసుకుని హిట్ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.