Begin typing your search above and press return to search.

శోభిత - నాగ‌చైత‌న్య‌ల వేవ్ స‌మ్మిట్ సెల్ఫీ

అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త్‌ను గ్లోబ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ హ‌బ్‌గా మార్చాల‌నే ల‌క్ష్యంతో కేంద్ర‌న ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి వేవ్స్ ముంబ‌యి వేదిక‌గా అత్యంత వైభ‌వంగా మొద‌లైంది.

By:  Tupaki Desk   |   2 May 2025 3:09 PM
Sobhita and Naga Chaitanya Wave Summit Selfie
X

అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త్‌ను గ్లోబ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ హ‌బ్‌గా మార్చాల‌నే ల‌క్ష్యంతో కేంద్ర‌న ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి వేవ్స్ ముంబ‌యి వేదిక‌గా అత్యంత వైభ‌వంగా మొద‌లైంది. గురువారం ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. `క‌నెక్టింగ్ క్రియేట‌ర్స్ -క‌నెక్టింగ్ కంట్రీస్‌` అనే నినాదంతో భార‌తీయ వినోద ప‌రిశ్ర‌మ ప్ర‌తిష్టను ప్ర‌పంచానికి చాటిచెప్పాల‌నే ల‌క్ష్యంతో భార‌త ప్ర‌భుత్వం ఈ స‌ద‌స్సును భారీ స్థాయిలో నిర్వ‌హిస్తోంది.


ఈ కార్య‌క్ర‌మంలో బాలీవుడ్ స్టార్స్‌తో పాటు ద‌క్షిణాదికి చెందిన సినీ స్టార్స్ భారీ స్థాయిలో పాల్గొన్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, చిరంజీవి, హేమామాలిని, మోహ‌న్ లాల్‌, అక్ష‌య్ కుమార్‌, మిధున్ చ‌క్ర‌వ‌ర్తి, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, క‌ర‌ణ్ జోహార్‌, అమీర్‌ఖాన్‌, దీపికా ప‌దుకునే వంటి స్టార్స్ పాల్గొన్నారు. ఇదే కార్య‌క్ర‌మంలో టాలీవుడ్ కొత్త జంట నాగ‌చైత‌న్య‌, శోభిత కూడా పాల్గొన్నారు.

జియో క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో నాలుగు రోజుల పాటు ఈ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. రీసెంట్‌గా మోహ‌న్ లాల్‌, ర‌జ‌నీకాంత్‌, హేమామాలిని, చిరంజీవి, అక్ష‌య్ కుమార్‌, మిధున్ చ‌క్ర‌వ‌ర్తిల‌కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైర‌ల్ కావ‌డం తెలిసిందే. తాజాగా యువ జంట నాగ‌చైత‌న్య‌, శోభిత‌ల సెల్ఫీ కూడా అదే స్థాయిలో సోష‌ల్ మ‌డియాలో వైర‌ల్‌గా మారి ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. డార్క్ బ్లూ బ్లేజ‌ర్‌లో బ్లాక్ గాగుల్స్ ధ‌రించి చైతూ, సారీలో శోభిత కారు బ్యాక్ సీట్లో కూర్చుని వేవ్ స‌మ్మిట్‌కు ముందు సెల్పీ తీసుకున్నారు.

ప్ర‌స్తుతం ఈ యువ జంట సెల్ఫీ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇద్ద‌రు క‌లిసి తొలిసారి సెల్ఫీకి పోజులివ్వ‌డంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అంతే కాకుండా త్వ‌ర‌లో ఇద్ద‌రూ క‌లిసి ఒక సినిమాలో న‌టిస్తే చూడాల‌ని ఉందంటూ కామెంట్‌లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న చైతూ ఇటీవ‌ల `తండేల్‌`తో భారీ హిట్‌ని ద‌క్కించుకోవ‌డం, వంద కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం తెలిసిందే. ఈ సినిమా అందించిన ఉత్సాహంతో చైతూ ప్ర‌స్తుతం `విరూపాక్ష‌` ద‌ర్శ‌కుడు కార్తీక్ దండు డైరెక్ష‌న్‌లో ఓ మిస్టిక్ థ్రిల్ల‌ర్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.