దానికింకా టైముంది
రీసెంట్ గా లావణ్య తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కన్ఫర్మ్ చేయగా, ఇప్పుడు ఈ విషయంలో శోభిత క్లారిటీ ఇచ్చింది.
By: Tupaki Desk | 8 May 2025 5:51 AMరీసెంట్ గా టాలీవుడ్ లోని ఇద్దరు హీరోయిన్లు ప్రెగ్నెంట్స్ అనే విషయంపై వార్తల్లో నిలిచారు. వాళ్లే శోభితా ధూళిపాల, లావణ్య త్రిపాఠి. గత కొన్ని రోజులుగా ఆ ఇద్దరి తీరు చూసి అందరూ వాళ్లను ప్రెగ్నెంట్స్ అని భావిస్తూ వచ్చారు. రీసెంట్ గా లావణ్య తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కన్ఫర్మ్ చేయగా, ఇప్పుడు ఈ విషయంలో శోభిత క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం తాను వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని, తల్లి అయ్యే విషయంలో ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదని తెలిపింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నాగ చైతన్య, శోభిత ధూళిపాల 2024 డిసెంబర్ లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటైన విషయం తెలిసిందే. వీరి పెళ్లి అయినప్పటి నుంచి శోభిత ప్రెగ్నెంట్ అనే వార్త నిత్యం పుట్టిస్తూనే ఉన్నారు.
దానికి తోడు రీసెంట్ గా జరిగిన వేవ్స్ సమ్మిట్ కు తన భర్తతో కలిసి చీరలో రావడంతో ఇక బాలీవుడ్ మీడియా శోభిత ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఎన్నో కథనాలను ప్రచురింది. ఎప్పుడూ మోడ్రన్ గా కనిపించే శోభిత, తన బేబీ బంప్ ను కవర్ చేయడానికి భిన్నంగా చీరలో వచ్చిందని పలు వార్తలొచ్చాయి.
ఈ విషయంలో అటు చైతన్య కానీ, ఇటు శోభిత కానీ మాట్లాడకపోవడంతో శోభిత ప్రెగ్నెన్సీ నిజమే అనుకున్నారంతా. కానీ శోభిత తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. శోభిత మాటల్ని బట్టి చూస్తుంటే అక్కినేని వారసులు రావడానికి ఇంకాస్త టైమ్ పట్టనుందని అర్థమవుతుంది.