Begin typing your search above and press return to search.

భీమవరం బేబీ గొడవ.. అసలేం జరిగిందో చెప్పిన SKN

మరోవైపు బేబీ టీమ్ పై రిపోర్టర్లు ఆందోళనకు దిగారని కూడా అంటున్నారు. అయితే ఈ సంఘటన పై మూవీ ప్రొడ్యూసర్ ఎస్కెఎన్ స్పష్టతనిచ్చారు.

By:  Tupaki Desk   |   5 Aug 2023 6:15 AM GMT
భీమవరం బేబీ గొడవ.. అసలేం జరిగిందో చెప్పిన SKN
X

ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య-విరాజ్ అశ్విన్ కలిసి నటించిన సినిమా 'బేబి'. సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఫన్ దర్శకుడు మారుతీ, ఎస్‍కేఎన్ (శ్రీనివాస కుమార్) సంయుక్తంగా కలిసి చిత్రాన్ని నిర్మించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై రూపొందించారు.

ఈ చిత్రం విడుదలై 20 రోజులు దాటినా... వసూళ్లు మాత్రం ఆగడం లేదు. యూత్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. దాదాపు రూ.5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం.. దాదాపు రూ. వంద కోట్ల మార్కుకు చేరువ లో ఉందని ట్రెడ్ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే బేబీ మూవీటీమ్ ప్రస్తుతం పలు నగరాల్లో సక్సెస్ టూర్స్ అంటూ పర్యటిస్తోంది.

ఇందులో భాగంగానే భీమవరం లో ఓ థియేటర్ లో బేబీ టీమ్ సందడి చేసింది. అయితే ఆ థియేటర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. బేబి మూవీ టీమ్ అక్కడికి రావడం వల్ల థియేటర్ వద్ద ప్రజలతో పాటు లోకల్ మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. బేబీ మూవీ బౌన్సర్స్ వారందరినీ నెట్టేశారు.

దీంతో పలువురు మీడియా ప్రతినిధులకు కూడా కిందపడిపోయారు. వారికి గాయాలు కూడా అయ్యాయని తెలిసింది. అయితే పవన్ అభిమానులు వల్ల ఇదంతా జరిగిందని కూడా ప్రచారం సాగుతోంది. మరోవైపు బేబీ టీమ్ పై రిపోర్టర్లు ఆందోళనకు దిగారని కూడా అంటున్నారు. అయితే ఈ సంఘటన పై మూవీ ప్రొడ్యూసర్ ఎస్కెఎన్ స్పష్టతనిచ్చారు.

అక్కడ ప్రజలు విపరీతంగా వచ్చి మీద పడిపోవడంతో తమ బౌన్సర్లు వాళ్లను అదుపు చేసేందుకు వాళ్లని నెట్టారని ఎస్కెఎన్ చెప్పుకొచ్చారు. అయితే గుంపులో ఓ లోకల్ మీడియా ప్రతినిధి కూడా ఉండటంతో అతడిని బౌన్సరు చూసుకోలేదని చెప్పారు. అందుకని గుంపుతో పాటు అతడిని కూడా నెట్టేశారంటూ క్లారిటీ ఇచ్చారు మూవీ నిర్మాత ఎస్కేఎన్.

ఇకపోతే ఈ బేబీ చిత్రానికి హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాల కు పనిచేసిన సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఓ అద్భతమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మ్యూజికల్ గానూ సూపర్ హిట్ అయింది. విజయ్ బుల్గానిన్ స్వరాలు సమకూర్చారు.