Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ.. రెండు సినిమాలకు సింగిల్ డీల్!

ఇలా ప్రస్తుతం టైర్ 2 హీరోలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్ లో విజయ్ దేవరకొండ ఉన్నారు.

By:  Tupaki Desk   |   5 May 2024 4:32 AM GMT
విజయ్ దేవరకొండ.. రెండు సినిమాలకు సింగిల్ డీల్!
X

రెండు, మూడు సినిమాలు వరుసగా సక్సెస్ పడితే హీరోలు రెమ్యునరేషన్ లు అమాంతం పెంచేస్తున్నారు. 10 కోట్లకి పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం టైర్ 2 హీరోలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్ లో విజయ్ దేవరకొండ ఉన్నారు. విజయ్ దేవరకొండ కెరియర్ లో నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.

గీతాగోవిందం మూవీ తర్వాత విజయ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే తరువాత కెరియర్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ లు రాలేదు. ఈ ఏడాది దిల్ రాజు బ్యానర్ లో ఫ్యామిలీ స్టార్ మూవీతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. గత ఏడాది సమంతతో కలిసి చేసిన ఖుషి మూవీ కూడా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది.

అయిన రెమ్యునరేషన్ పరంగా విజయ్ ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. విజయ్ ఒక్కో సినిమాకి 12 నుంచి 15 కోట్ల వరకు తీసుకుంటున్నాడంట. ఫ్లాప్ లు వచ్చిన నిర్మాతలు అతనితో మూవీస్ చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే నాన్ థియేట్రికల్ గా అతనికి మంచి మార్కెట్ ఉంది.

ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ సెకండ్ మూవీ కన్ఫర్మ్ అయ్యింది. ఫ్యామిలీ స్టార్ తర్వాత కూడా దిల్ రాజు విజయ్ తో మరో ప్రాజెక్ట్ చేయడానికి కారణం రివీల్ అయ్యింది.

దిల్ రాజు ముందుగానే విజయ్ తో రెండు సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చారంట. కరోనా సమయంలో విజయ్ కి అడ్వాన్స్ గా కొంత మొత్తం చెల్లించాడంట. అలాగే రెండు సినిమాలకి 25 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారంట. అందులో భాగంగా మొదటి చిత్రంగా పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ మూవీ చేశారు. థియేటర్స్ లో ఈ మూవీ కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయ్యింది.

అయితే దిల్ రాజు డిజిటల్ రైట్స్ ద్వారా కొంత సేఫ్ అయ్యారంట. ఈ నేపథ్యంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీకి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. కిరణ్ అబ్బవరంతో రాజావారు రాణిగారు, విశ్వక్ సేన్ తో అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో (రైటర్) రవికిరణ్ కోలా రెండు హిట్స్ అందుకున్నారు. అతను చెప్పిన కథ దిల్ రాజుకి నచ్చడంతో విజయ్ దేవరకొండ హీరోగా సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఒక ఫోటోతో ఈ కాంబినేషన్ సినిమాని దిల్ రాజు కన్ఫర్మ్ చేశారు. పూర్తి వివరాలు త్వరలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.