Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందమైన జంట మరింత అందంగా..!

ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఈ జోడీ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కియారా, సిద్దార్థ్ తీసుకున్న ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   4 March 2024 11:55 AM GMT
పిక్ టాక్ : అందమైన జంట మరింత అందంగా..!
X

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ ఏడాది క్రితం సిద్దార్థ్ మల్హోత్రా ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత కూడా ఇద్దరు చాలా బిజీగా ఉన్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సాధ్యం అయినంత ఎక్కువ సమయం ను వీరిద్దరు గడుపుతూ ఉన్నారు.

రెగ్యులర్‌ గా ఈ అందమైన జంట ఫోటో షూట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఈ జోడీ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కియారా, సిద్దార్థ్ తీసుకున్న ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

బాలీవుడ్ లో ఇప్పటి వరకు అతి కొద్ది జంటలను మాత్రమే అందమైన జంటలు అంటూ ఉండేవారు. ఇప్పుడు ఆ జాబితాలో కియారా అద్వానీ, సిద్దార్థ్‌ మల్హోత్ర జోడీ కూడా చేరిందని నెటిజన్స్ ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అందమైన జంట మరింత అందంగా ఈ ఫోటోల్లో కనిపిస్తున్నారు.

బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్ లో కూడా కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించిన కియారా అద్వానీ ప్రస్తుతం రామ్‌ చరణ్ కు జోడీగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌ చేంజర్ లో నటిస్తోంది.

ఇక బాలీవుడ్‌ లో కూడా మూడు నాలుగు సినిమాలో కియారా అద్వానీ బిజీ బిజీగా ఉంది. సిద్దార్థ్‌ మల్హోత్ర కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న సిద్దార్థ్‌ మరోసారి కియారాతో నటించే అవకాశాలు ఉన్నాయి.