Begin typing your search above and press return to search.

వేణు స్వామి కామెంట్స్ పై ప్రభాస్ పెద్దమ్మ స్పందన ఇదే..!

ముఖ్యంగా కొందరు కావాలని ప్రభాస్ మీద కామెంట్స్ చేసుకుంటూ పబ్బం గడుపుతుంటారు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 12:11 PM GMT
వేణు స్వామి కామెంట్స్ పై ప్రభాస్ పెద్దమ్మ స్పందన ఇదే..!
X

ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కృష్ణం రాజు కారణమని తెలిసిందే. కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రభాస్ లాంటి హీరోని ఒక మాట అంటే సోషల్ మీడియాలో పాపులర్ అవ్వొచ్చు అనే ఆలోచనతో కొందరు ఉంటారు. ముఖ్యంగా కొందరు కావాలని ప్రభాస్ మీద కామెంట్స్ చేసుకుంటూ పబ్బం గడుపుతుంటారు. అలాంటి వారిలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకరు.

ప్రభాస్ పెళ్లి విషయంలో.. అతని ఆరోగ్యం విషయంలో వేణు చేసే కామెంట్స్ అందరికీ తెలిసిందే. ప్రభాస్ పెళ్లి చేసుకున్నా విడాకులు అవుతాయని.. ప్రభాస్ అసలు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటే బెటర్ అని మాట్లాడుతుంటాడు. అంతేకాదు ప్రభాస్ జాతకం తను చూసి ఇవన్నీ చెబుతున్నానని అంటాడు. అయితే రీసెంట్ గా ఈ కామెంట్స్ పై కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి రెస్పాండ్ అయ్యారు.

కృష్ణం రాజు మరణానంతరం అసలు బయట ప్రపంచానికి కనిపించని ఆమె ఇన్నాళ్లకు బయటకు వచ్చారు. ఇక రీసెంట్ గా ఆమె ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కృష్ణం రాజు గారి మీద తనకున్న ప్రేమను మరోసారి ఆమె వెల్లడించారు. అయితే కృష్ణం రాజు ఫ్యామిలీ మీద కొందరు కావాలని చేస్తున్న కామెంట్స్ పై కూడా ఆమె స్పందించారు. మా ఫ్యామిలీ అవేవి పట్టించుకోదని ఇంకా అలా చేస్తే వారికి డబ్బులు పేరు వస్తే సంతోషిస్తామని అన్నారు.

అయితే అందరి వల్లా ఏమో కానీ వేణు స్వామి చేసే కామెంట్స్ మీద ఆమె స్పందించారు. ప్రభాస్ జాతకం పై ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ప్రభాస్ జాతకం అతని తల్లి దగ్గర ఉంది ఇప్పటివరకు అది మేమే చూడలేదు. మరి ప్రభాస్ జాతకం అతని దగ్గరకు ఎలా వెళ్లింది అని అన్నారు. ప్రభాస్ ఆరోగ్య బాగోదని పెళ్లి విషయంపై అతను చేసే కామెంట్స్ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు.

కృష్ణం రాజు గారు ఉన్నప్పుడు ఇలా ఎవరైనా తమ గురించి చెడుగా మాట్లాడితే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని వదిలేస్తారని. తాము కూడా అలానే ఈ విషయాలన్నీ పట్టించుకోమని అన్నారు శ్యామలా దేవి. ప్రభాస్ మా అందరితో చాలా ఆప్యాయంగా ఉంటాడని తనకు చెల్లెల్లు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు శ్యామలా దేవి.