Begin typing your search above and press return to search.

ఐరన్ లెగ్.. ఇప్పుడు లక్కీ హీరోయిన్

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా శ్రుతికి సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది

By:  Tupaki Desk   |   25 Dec 2023 6:31 AM GMT
ఐరన్ లెగ్.. ఇప్పుడు లక్కీ హీరోయిన్
X

శ్రుతిహాసన్‌.. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా అన్ని రకాల సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే తన నటనతో ఆకట్టుకుని కొన్ని అవార్డులను కూడా అందుకుంది. బాలీవుడ్ సినిమా లక్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ఆదిలోనే లక్ కలిసి రాలేదు. తొలి సినిమా ఫ్లాఫ్ అవ్వగా.. ఆమె యాక్షన్ కూడా బాలేదని క్రిటిక్స్ రివ్యూలు ఇచ్చారు. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ తెరకెక్కించిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి.

ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టినా మూవీ మాత్రం కమర్షియల్ గా పరాజయమైంది. ఆ తర్వాత ఓ మై ఫ్రెండ్, త్రీ, సెవెంత్ సెన్స్ సినిమాల్లో నటించింది. కానీ ఒక్క సినిమా కూడా శ్రుతికి హిట్ అందించలేదు. దీంతో ఆమెపై ఐరన్ లెగ్ అని ముద్ర పడింది. వరుస ఫ్లాపులను మూటగట్టుకున్న ఈ బ్యూటీ.. 2012లో హరీశ్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ లో పవన్ కల్యాణ్ సరసన నటించింది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా శ్రుతికి సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయతే ఈమెను అప్పుడు ఐరన్ లెగ్ అన్న వాళ్లే.. ఇప్పుడు స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ అని అంటున్నారు. ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు శ్రుతి సక్సెస్ లు ఇస్తున్నారని చెబుతున్నారు. కథానాయకులు కమ్ బ్యాక్ కు ఫుల్ సోర్స్ గా మారారని అంటున్నారు. మరి ఆ హీరోలు ఎవరు? శ్రుతి నటించిన ఆ చిత్రాలేంటి?

రాజా ది గ్రేట్ సినిమా తర్వాత ఒక్క హిట్ లేక సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజకు 2020లో శ్రుతి హాసన్ హిట్ ను అందించింది. ఆమె నటించిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అయింది. రవితేజకే మాత్రమే కాదు గోపీచంద్ మలినేనికి కూడా ఈ మూవీ కమ్ బ్యాకే. అజ్ఞాతవాసి సినిమా తర్వాత వకీల్ సాబ్ తో సినీ ఇండస్ట్రీలోకి 2021లో రీఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పవన్ కల్యాణ్ కు కమ్ బ్యాక్ ఇచ్చింది. అప్పటికే రాజకీయాల్లో పవన్ ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్లు అయింది.

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు మూటగట్టుకున్న మెగా స్టార్ చిరంజీవి 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సైరా, ఆచార్య తర్వాత చిరుకు వాల్తేరు వీరయ్య కమ్ బ్యాక్ మూవీ అని చెప్పవచ్చు. అప్పుడెప్పుడో బాహుబలితో హిట్ కొట్టిన ప్రభాస్.. తాజాగా సలార్ మూవీతో భారీ విజయం సాధించారు. ఈ మూవీలో కూడా శ్రుతి హాసనే హీరోయిన్ కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ ను అల్లాడిస్తోంది. భారీ వసూళ్లు రాబడుతోంది. అలా టాలీవుడ్ స్టార్ హీరోలకు శ్రుతి హాసన్ లక్కీ హీరోయిన్ మారిపోయింది. మరి ఆమె కొత్త సినిమాలు ఏం చేస్తాయో చూడాలి.