Begin typing your search above and press return to search.

బేబి రాధ నిదుర‌పోలేదు అందుక‌ని శ్రీ‌య..!

సోష‌ల్ మీడియాల్లో శ్రీ‌య శ‌ర‌ణ్ కోశ్చీవ్ స్పీడ్ గురించి తెలిసిందే. రెగ్యుల‌ర్ గా అభిమానుల‌కు త‌న వ్య‌క్తిగ‌త, కుటుంబ విష‌యాల‌తో పాటు సినిమాల గురించి అప్ డేట్ చేస్తోంది

By:  Tupaki Desk   |   20 Oct 2023 4:00 AM GMT
బేబి రాధ నిదుర‌పోలేదు అందుక‌ని శ్రీ‌య..!
X

సోష‌ల్ మీడియాల్లో శ్రీ‌య శ‌ర‌ణ్ కోశ్చీవ్ స్పీడ్ గురించి తెలిసిందే. రెగ్యుల‌ర్ గా అభిమానుల‌కు త‌న వ్య‌క్తిగ‌త, కుటుంబ విష‌యాల‌తో పాటు సినిమాల గురించి అప్ డేట్ చేస్తోంది. ముఖ్యంగా త‌న గారాల ప‌ట్టీ రాధ‌తో సెల‌బ్రేష‌న్స్ ని ఫ్యాన్స్ మిస్స‌వ్వ‌కుండా ప్ర‌తిదీ అప్‌డేట్ చేయ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. తాజాగా అలాంటి ఒక ఫోటోషూట్ ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. బేబి రాధ‌ను ఎత్తుకుని ఎంతో మురిపెంగా లాల‌న‌గా చూస్తున్న శ్రీ‌య‌కు రాధ‌ స‌రిగా నిదుర‌పోలేద‌ని అర్థ‌మైంది. చిన్నారి రాధ నిద్ర‌లేమితో త‌న క‌ళ్ల‌ను చేతితో అలా నులుముకుంటూ క‌నిపించింది. స్లీప్ వెల్ మై ల‌వ్.. విల్ బి బ్యాక్ సూన్‌.. అంటూ ఈ ఫోటోకి శ్రీ‌య క్యాప్ష‌న్ ని ఇచ్చింది. ఇక ఈ ఫోటోషూట్ కోసం శ్రీ‌య ప్రిపేరైన తీరు సంథింగ్ స్పెష‌ల్ అని చెప్పాలి. థైస్లిట్ డ్రెస్ లో శ్రీ‌య హాట్ మామ్ అంటూ అభిమానులు దీనిపై కామెంట్లతో విరుచుకుప‌డుతున్నారు.


శ్రియా శరన్ - ఆండ్రీ కోశ్చీల ప్రేమకథ

శ్రియ 2018లో బార్సిలోనాకు చెందిన‌ రష్యన్ టెన్నిస్ క్రీడాకారుడు, బిజినెస్‌మేన్ ఆండ్రీ కొస్చీవ్‌ను వివాహం చేసుకుంది. ఈ జంట వివాహానంత‌రం బార్సిలోనాకు వెళ్లారు. కరోనా లాక్‌డౌన్ కాలంలోనే భ‌ర్త‌తో శ్రీ‌య‌ బార్సిలోనాలో కొన్ని సంవత్సరాల పాటు గడిపారు. ఆగస్ట్ 2022లో ఆమె భ‌ర్త స‌హా భారత్‌కు తిరిగి వచ్చారు. నేను ఒత్తిడికి లోనైనప్పుడల్లా లేదా నేను చేస్తున్న పని గురించి ఆందోళన చెందుతున్నప్పుడు, అతను ఎల్లప్పుడూ నన్ను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు. అతడు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అంటూ శ్రీ‌య మురిపెంగా చెబుతంది. నేను అతనితో గడిపే ప్రతి నిమిషాన్ని ప్రేమిస్తాన‌ని శ్రీ‌య మురిసిపోతుంది.

ఆండ్రీని తొలిసారి మాల్దీవుల్లో కలిశానని శ్రియ వెల్లడించింది. అప్పట్లో శ్రియ నటి అని తనకు తెలియదని, తను న‌టించిన‌ సినిమాలు ఆన్‌లైన్‌లో ల‌భిస్తాయా? అని అండ్రూ కోశ్చీవ్ అడిగాడట‌. ఆండ్రీ తన సినిమాలను చూసి ఆస్వాధించారు. అవి ఎంతో స్వీటెస్ట్ అని కాంప్లిమెంట్ ఇచ్చిన‌ట్టు శ్రీ‌య ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది.

ఇబ్బంది పెట్టిన అభిమాని:

ఇంత‌కుముందే శ్రీ‌య విమానాశ్రంలో ఒక అభిమాని వ‌ల్ల ఇబ్బంది ప‌డిన వీడియో వైర‌ల్ అయింది. ఒక వ్యక్తి సెల్ఫీ కోసం మీది మీదికొచ్చాడు. ఫోటో తీయడానికి తన దగ్గరికి వచ్చిన తర్వాత శ్రియా శరణ్ అసౌకర్యంగా క‌నిపించింది. ఆ దృశ్యం గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయం నుండి బయటకు వెళుతున్న స‌మ‌యంలోనిది. ఆమెకు ఫొటోగ్రాఫర్లు, అభిమానులు ఘ‌న‌ స్వాగతం పలికారు. శ్రియ కెమెరాలకు పోజులివ్వడం .. అభిమానులతో సెల్ఫీలు దిగ‌డం ఆపేసాక కూడా త‌న‌తో ఫోటో దిగ‌డానికి ఒక వ్య‌క్తి మీది మీదికొచ్చాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ షేర్ చేసిన వీడియోలో, శ్రియ ఒకరితో మాట్లాడుతూ ఒక అడుగు వెనక్కి వేసి అనుకోకుండా ఒక వ్యక్తిని ఢీకొట్టింది. శ్రీ‌య‌ అనుమతి లేకుండా ఆ వ్యక్తి ఆమెతో ఫోటో దిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతను ఎంత ద‌గ్గ‌ర‌గా వ‌చ్చేశాడో ఆ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతుంది. శ్రియ ఆ స‌మ‌యంలో అసౌకర్యంగా కనిపించింది. కానీ అతడితో సెల్ఫీ కోసం పోజులిచ్చింది.

కెరీర్ జ‌ర్నీ..

ఉత్త‌రాఖండ్ కి చెందిన ఈ బ్యూటీ శిక్షణ పొందిన కథక్ నృత్యకారిణి. మొదట శ్రీ‌య ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ తరువాత నటిగా మారింది. ఇటీవల ఇంట్లో కథక్ నృత్యం చేస్తున్న వీడియో క్లిప్‌ను అప్‌లోడ్ చేయ‌గా అది వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. శ్రియ 2001లో తెలుగు చిత్రం ఇష్టంతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. అయితే 2002లో విడుద‌లైన నాగార్జున 'సంతోషం' చిత్రంతో తన మొదటి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. తరువాత చత్రపతి, శివాజీ: ది బాస్, మిషన్ ఇస్తాంబుల్, RRR స‌హా చాలా బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించింది. బ్లాక్ బ‌స్ట‌ర్ దృశ్యం ఫ్రాంచైజీలోను శ్రీ‌య న‌టించింది. చివరిగా పాపా రావు బియ్యాలా రచించి దర్శకత్వం వహించిన సంగీత నేప‌థ్య చిత్రంలో కనిపించింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శర్మన్ జోషి, ఓజు బారువా, గ్రేసీ గోస్వామి కూడా నటించారు. త‌దుప‌రి 'నడడ' అనే చిత్రంలో న‌టిస్తోంది. దీనికి రాహుల్ సింగ్ రాణా కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. 4 ఏప్రిల్ 2024న విడుద‌ల కానుంది.