Begin typing your search above and press return to search.

మెగా కాంపౌండ్‌తో అంతా ఓకే: శివానీ

మలయాళంలో 2021లో వచ్చిన 'నాయట్టు' చిత్రానికి రీమేక్‌గా 'కోట బొమ్మాళి పిఎస్‌' చిత్రం రూపొందింది

By:  Tupaki Desk   |   19 Nov 2023 9:18 AM GMT
మెగా కాంపౌండ్‌తో అంతా ఓకే: శివానీ
X

మలయాళంలో 2021లో వచ్చిన 'నాయట్టు' చిత్రానికి రీమేక్‌గా 'కోట బొమ్మాళి పిఎస్‌' చిత్రం రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ .. వరలక్ష్మి శరత్ కుమార్ .. రాహుల్ విజయ్ .. శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. గత కొన్ని సంఘటనలు చూస్తుంటే, మీరు గీతా ఆర్ట్స్ 2 లో ప‌ని చేయడం కొంతమందికి ఆశ్చర్యంగా ఉంది.. మీరు ఎలా ఫీలవుతున్నారు? అనే ప్రశ్న ఈ చిత్రంలో న‌టించిన శివానీ రాజ‌శేఖ‌ర్ కి ఎదురైంది.

దీనికి శివానీ బదులిస్తూ, ''ఇక్కడ వ్యక్తిగత జీవితం భిన్నంగా ఉంటుంది. వృత్తిగ‌త‌ జీవితం వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. వ్య‌క్తులుగా ఎవరి ఆలోచనలు..అభిప్రాయాలు వారివి. ఏదో ఒక సమయంలో అపోహలు..అపార్థాలు తలెత్తి ఉండవచ్చు. సినిమాగా చూస్తే మేమంతా ఒక కుటుంబమే. వ్యక్తిగతంగా చూసినా కొట్లాట‌లు లాంటిదేమీ జరగలేదు. ఇలా అయింది అలా అయింది అని రాస్తారు. మేం మాట్లాడుకుంటున్నాం. అంతా అయిపోయింది.. ఇప్పుడంతా ఓకే'' అని అన్నారు.

నేటిత‌రం క‌థానాయిక‌ల‌కు సినిమాలు, వెబ్ సినిమాల‌తో బోలెడ‌న్ని అవ‌కాశాలొస్తున్నాయి. శివానీ న‌ట‌నారంగంలో త‌న కెరీర్ ఎదుగుద‌ల కోసం ప్ర‌స్తుతం హార్డ్ వర్క్ చేస్తోంది.